తగులబడుతోన్న దేవభూమి: అరుదైన వృక్షాలు బుగ్గిపాలు: వన్యప్రాణుల సజీవదహనం: 4 రోజులైనా
డెహ్రాడున్: దేవభూమిగా భావించే ఉత్తరాఖండ్ మంటల బారిన పడింది. ఉత్తరాఖండ్ అడవుల్లో నాలుగు రోజుల కిందట చెలరేగిన మంటలు దహించి వేస్తున్నాయి. వేలాది అరుదైన వృక్షాలు, ఔషధ మొక్కలు బుగ్గిపాలు అవుతున్నాయి. వన్యప్రాణుల మనుగడ ప్రమాదంలో పడింది. వందల సంఖ్య వన్యప్రాణులు మంటలకు అహూతి అవుతున్నాయి. మంటల బారి నుంచి తప్పించుకోవడానికి జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి.
Recommended Video
తమ పౌరులను స్వదేశానికి తీసుకువెళ్లాలని చైనా సంచలన నిర్ణయం ..ఉద్రిక్తతల నేపధ్యమేనా ?
ఎండ తీవ్రత వల్లే మంటలు ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు. రాజధాని డెహ్రాడూన్ సహా నాలుగు ఆరు జిల్లాల్లో కార్చిచ్చు అంటుకుంది. డెహ్రాడూన్, నైనిటాల్, పౌరి, చమోలి, పితోర్గఢ్, అల్మోరా, బాగేశ్వర్ జిల్లాల్లో కార్చిచ్చు తీవ్రత అధికంగా ఉంటోంది. ఆయా జిల్లాల్లో 51.34 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం మంటల బారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు. మంటల తీవత్ర మరింత విస్తరించే ప్రమాదం లేకపోలేదని అనుమానిస్తున్నారు.
హిమాలయ పర్వత పంక్తులను ఆనుకుని ఉండే అడవులు కావడం వల్ల అరుదైన జాతికి చెందిన వృక్షాలు, ఔషధ మొక్కలకు ఆలవాలం ఉత్తరాఖండ్. నాలుగు రోజులుగా చెలరేగుతున్న మంటల వల్ల చాలామటుకు అహూతి అయినట్లు అధికారులు చెబుతున్నారు. పక్షులు, వన్యప్రాణులు సజీవ దహనం అవుతున్నాయి. వరుసగా నాలుగోరోజు కూడా మంటలను నియంత్రించడంలో విఫలమైంది అక్కడి ప్రభుత్వం. ఫలితంగా కొత్త ప్రాంతాలకు అగ్నికీలలు వ్యాప్తి చెందుతున్నాయి.
అటవీ సాంధ్రత అధికంగా ఉండే ఉత్తరాఖండ్లో కార్చిర్చు వ్యాప్తి చెందే సంఘటనలు కొత్తేమీ కాదు. ప్రతి సంవత్సరం వేసవిలో అడవులు అంటుకుంటూనే ఉంటాయి. వాటి తీవ్రత పెద్దగా ఉండదు. ఈ సారి మాత్రం నాలుగు రోజులుగా అడవులు మండుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు. మంటలను నియంత్రించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించట్లేదని విమర్శిస్తున్నారు.