వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ జలప్రళయం -సొరంగంలో చిక్కుకున్న 16 మందిని కాపాడిన ఐటీబీపీ

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్‌లో.. సముద్రమట్టానికి 7,108అడుగుల ఎత్తువరకు విస్తరించి ఉన్న నందాదేవి హిమానినదం(మంచు పర్వతం లేదా గ్లేసియర్) ఒక్కసారిగా బద్దలుకావడం, మంచు చరియలు విరిగి పడడంతో ధౌలి గంగా నదిలో జలప్రళయం సంభవించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీసు (ఐటీబీపీ) ఆధ్వర్యంలో సహాచక చర్యలు కొనసాగుతున్నాయి.

ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని జోషిమఠ్ ప్రాంతంలో వాతావరణం సంక్లిష్టంగా ఉండే చోట రిషిగంగ పేరుతో పవర్ ప్రాజెక్టును నిర్మిస్తుండగా, ఒక్కసారిగా పోటెత్తిన వరదలో ప్రాజెక్టు, మరో మూడు వంతెనలు కొట్టుకుపోయాయి. జలప్రళయం దెబ్బకు రేనీ- తపోవన్‌ వద్ద ఉన్న పవర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిగా ధ్వంసమైంది. పవర్‌ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతైనట్లు ఐటీబీపీ అధికారులు చెప్పారు. కాగా,

ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -భారత్‌పై విదేశీ కుట్రలకు ఆధారాలు -తేయాకుపైనా పన్నాగంప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -భారత్‌పై విదేశీ కుట్రలకు ఆధారాలు -తేయాకుపైనా పన్నాగం

Uttarakhand glacier burst: ITBP rescues all 16 people trapped in Tapovan tunnel

ఇప్పటి వరకు 10 మృతదేహాలను గుర్తించగా, పవర్ ప్రాజెక్టు టన్నెల్ లో చిక్కుకుపోయిన 16 మందిని ఐటీబీపీ బలగాలు కాపాడాయి. మిగతావారి జాడకోసం గాలిస్తున్నామని అధికారులు చెప్పారు. గల్లంతైన వారంతా బహుశా మరణించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వరద పోటెత్తిన ధౌలి గంగానది.. గంగకు ఉపనది కావడంతో అది ప్రయాణించే మార్గాల్లోని అన్ని ఊళ్లలో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.

హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దుహౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దు

చమోలి వరదల నేపథ్యంలో తెహ్రీ డ్రామ్ నుంచి నీటి ప్రవాహాన్ని నిలిపివేసినట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. రిషిగంగ, అలకానంద నదుల్లో పెరుగుతున్న జలాల ప్రవాహానికి మార్గం సుగమం చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. నదుల ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని అన్ని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. అలకానంద ప్రాజెక్టులో నీటి ప్రవాహం సాధారణ స్థాయిలో ఉందన్నారు.

English summary
There was an under constructed tunnel near Tapovan dam in Uttarakhand where around 20 workers are stranded. ITBP has rescued all 16 people. A major tragedy was reported in Uttarakhand's Chamoli on Sunday after a glacier broke in Dhauli Ganga valley in the Joshimath area. Rishiganga Power Project has been damaged due breach of a glacier in the Tapovan area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X