కన్యపూజలు చేసిన 'యోగి': తొమ్మిది మంది బాలికల కాళ్లు కడిగి..
పార్వతీదేవి తొమ్మిది అవతారాలకు చిహ్నంగా తొమ్మిదిమంది బాలికలకు సీఎం యోగి కన్య పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
లక్నో: శ్రీరామనవమి సందర్బంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కన్యపూజ చేశారు. లక్నోలో నిర్వహించిన నవమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాలికల కాళ్లు కడిగి సాంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు. పార్వతీదేవి తొమ్మిది అవతారాలకు చిహ్నంగా తొమ్మిదిమంది బాలికలకు సీఎం యోగి కన్య పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
అనంతరం తొమ్మిది మంది బాలికల పాదాలు కడిగి వారికి తిలకం దిద్దారు. పూజా కార్యక్రమాల తర్వాత హల్వా, పూరీ వంటి సాంప్రదాయ పిండి వంటలను బాలికలకు వడ్డించి వారితో 'అన్నదాతా సుఖీభవ' అని దీవించుకున్నారు. కాగా, ప్రతి ఏటా కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు జరుగుతుంటాయి.
ఈ తొమ్మిది రోజులు సీఎం యోగి కచ్చితమైన నియమ నిబంధనలతో కూడిన ఉపవాస దీక్ష చేస్తారు. దీక్ష పూర్తయిన తర్వాత కన్నెపూజలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఉపవాస దీక్ష ముగించుకున్న యోగి బుధవారం నాడు కన్నెపూజలు నిర్వహించారు.