ఎన్టీఆర్ మృతిపై దర్యాప్తు: విహెచ్, ఎన్టీఆర్ పేరుపై గొడవ
అధికారం సంపాదించుకోవటానికి ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటున్న తెలుగుదేశం నాయకులు ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయంలోటెర్మినల్ పేరు మార్పుపై ఒక వివాదం లేవదీస్తూరాజకీయం చేస్తున్నారని ఆయన మీడియాతో అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం దేశీ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడానికి తెలంగాణ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హనుమంతరావు ఆ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుంటే, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్కు ఎన్టీ రామారావు పేరు పెట్టటంపై తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పక్షం నాయకుడు తోట నరసింహం గొడవ పడ్డారు. సోమవారంనుండి ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా కొనసాగించే అంశం గురించి చర్చించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం సాయంత్రం పార్లమెంటు గ్రంథాలయంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అన్ని పక్షాల లోక్సభ నాయకులు హాజరైన ఈ సమావేశంలో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్కు ఎన్టీ రామారావు పెట్టటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్కు ఎన్టీ రామారావు పేరు పెట్టటం అన్యాయమని వాదించారు.
తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం జితేందర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఎన్టీ రామారావు తెలుగువారందరికి నాయకుడని, అతని పేరు పెట్టటం పూర్తిగా సమర్థనీయమని వాదించారు. ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, గతంలో యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు చేశారని ఆయన వివరించారు. దీనితో ఇద్దరి మధ్య కొంత వాదన జరిగింది.
ఈ దశలో హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ జోక్యం చేసుకుని ‘మీ ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు కదా, ఇద్దరూ చర్చించుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా?' అని సూచించటంతో గొడవకు తెరపడింది. ఇద్దరి మధ్య వాదన జరుగుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వౌనంగా ఉండిపోయారు.