బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విస్కీ బాటిల్ తో బాలీవుడ్ నిర్మాత ముఖం పచ్చడి చేసిన హీరోయిన్ సంజన, రచ్చరచ్చ, తల్లిని తిట్టింది!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: స్యాండిల్ వుడ్ ప్రముఖ నటి సంజనా గర్లానీపై వివాదం మొదలైయ్యింది. విస్కీ బాటిల్, గ్లాస్ తీసుకుని తన ముఖం మీద సంజనా దాడి చేసిందని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగిన మైకంలో బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటలో నటి సంజనా, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ రచ్చరచ్చ చేశారనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ స్యాండిల్ వుడ్ నటి సంజనా మీద ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని బెంగళూరు డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ దృవీకరించారు.

నా భార్య అందంగా ఎందుకు తయారైయ్యింది ?: అక్రమ సంబంధం, అనుమానం, కసితీరి పొడిచి చంపేసి!నా భార్య అందంగా ఎందుకు తయారైయ్యింది ?: అక్రమ సంబంధం, అనుమానం, కసితీరి పొడిచి చంపేసి!

 ఫైవ్ స్టార్ హోటల్ లో పబ్

ఫైవ్ స్టార్ హోటల్ లో పబ్

బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లోని కూంఝీ బార్ (పబ్)లో క్రిసమస్ పండుగ సందర్బంగా డిసెంబర్ 24వ తేదీ రాత్రి మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ మందు పార్టీకి ప్రముఖ సెలబ్రిటీలు హాజరైనారు. బాలీవుడ్ నిర్మాత వందనా జైన్, స్యాండిల్ వుడ్ ప్రముఖ నటి సంజనా సైతం ఇదే పార్టీకి హాజరైనారు.

ఒకే టేబుల్ లో వందనా, సంజనా

ఒకే టేబుల్ లో వందనా, సంజనా

రాత్రి పబ్ లోని ఒకే టేబుల్ లో వందనా జైన్, సంజనా మద్యం సేవించారు. తరువాత ఇద్దరి మద్య చిన్న విషయంలో వాగ్వివాదం మొదలైయ్యింది. మద్యం మత్తులో ఉన్న వందనా జైన్, సంజనా ఏదో మాట్లాడుకుంటున్నారని అక్కడ ఉన్న వారు భావించారు. అయితే వందనా జైన్, సంజనాల మధ్య మాటామాటా పెరిగిపోయిందని తెలిసింది.

 విస్కీ బాటిల్ తో ముఖం పచ్చడి !

విస్కీ బాటిల్ తో ముఖం పచ్చడి !

మద్యం మత్తులో ఉన్న నటి సంజనా ఆమె చేతిలో విస్కీ గ్లాస్, విస్కీ బాటిల్ తీసుని వందనా జైన్ ముఖం మీద దాడి చేసిందని సమాచారం. సంజనా, వందనా జైన్ రచ్చరచ్చ చెయ్యడంతో అక్కడ ఉన్న వారు ఇద్దరికీ నచ్చచెప్పారని తెలిసింది. మద్యం మత్తులో చిన్న విషయానికి మాటామాటా పెరిగి ఇలా జరిగిందని అక్కడ ఉన్న కొందరు అంటున్నారు.

 బెంగళూరు కమిషనర్

బెంగళూరు కమిషనర్

గొడవ జరిగిన తరువాత వందనా జైన్ నేరుగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ చేరుకుని నటి సంజనా మీద ఫిర్యాదు చేశారు. నటి సంజనా మీద బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ దృవీకరించారు. సంజనా, వందనా జైన్ రాద్దాంతం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ వరకు వెళ్లిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. తాను ప్రస్తుతం బెంగళూరులో లేనని, ఆదివారం అక్కడికి వచ్చిన తరువాత అన్ని విషయాలు పూర్తిగా చెబుతానని వందనా జైన్ అంటున్నారు.

నా తల్లిని ధూషించింది

నా తల్లిని ధూషించింది

పబ్ లో గొడవ జరిగిన మాట వాస్తవం, తన తల్లిని వందనా జైన్ దూషించడంతో పాటు తన చెయ్యి పూర్తిగా వెనక్కు తిప్పడంతో నొప్పి కలిగిందని, ఆ సమయంలో వందనా మీద తాను చెయ్యి చేసుకోవలసి వచ్చిందని సంజనా అంటోంది. మొత్తం మీద సంజనా, వందనా రాద్దాంతం పోలీసుల తలుపుతట్టిందని స్యాండిల్ వుడ్ వర్గాలు చెబుతున్నాయి.

వందనా జైన్ బెంగళూరు మహిళ

వందనా జైన్ బెంగళూరు మహిళ

బెంగళూరుకు చెందిన వందనా జైన్ బాలీవుడ్ సినిమాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగళూరుకు చెందిన వందనా జైన్ ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నారు. అయితే నిత్యం వందనా జైన్ బెంగళూరులోని పార్టీలకు, శుభకార్యాలకు వచ్చి వెలుతున్నారు. బల్విందర్ సింగ్ ఫేమస్ హోగయా తదితర హిందీ హిట్ సినిమాలను వందనా జైన్ నిర్మించారు.

English summary
Vandana Jain filed complaint in Bengaluru against Kannada actres Sanjanana Galrani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X