మోడీ నామినేషన్ వేళ.. వారణాసి మెరిసేలా..! లక్షన్నర లీటర్ల మంచినీరు వృధా..!
వారణాసి : ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా ఓ వార్త వైరల్ గా మారింది. మోడీ వస్తున్న సందర్భంలో రోడ్లను శుభ్రపరచడానికి లక్షా 40 వేల లీటర్ల మంచినీటిని వృధా చేశారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ప్రధాన కూడళ్లతో పాటు వారణాసి తళతళ మెరిసేలా ట్యాంకర్ల కొద్దీ నీరు వేస్ట్ చేశారనే టాక్ జోరందుకుంది.
శుక్రవారం వారణాసి నుంచి మోడీ నామినేషన్ వేయనుండటంతో.. గురువారం రాత్రి రోడ్లను శుభ్రం చేయించారట మున్సిపల్ అధికారులు. మోడీ నామినేషన్ కు ముందు వారణాసి వీధుల్లో భారీ ర్యాలీ తలపెట్టడంతో.. రోడ్లను క్లీన్ చేయించాలంటూ పైనుంచి ఆదేశాలు అందాయని చెబుతున్నారట.
తండ్రి దారిలో ఆశారాం బాపు కుమారుడు.. అత్యాచారం కేసులో దోషి
వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన దాదాపు 40 ట్యాంకర్లు, 400 మంది కార్మికులతో రోడ్లు, ప్రధాన కూడళ్లు శుభ్రం చేయించినట్లు తెలుస్తోంది. వారణాసి పర్యాటక కేంద్రం కావడంతో పండుగల సమయంలో మాత్రమే నీటితో రోడ్లను శుభ్రం చేసే ఆనవాయితీ ఉందట. కానీ మోడీ నామినేషన్ సందర్భంగా దాదాపు లక్షన్నర లీటర్ల నీరు వృధా చేయడమేంటనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.