వేదికపైనుంచి పడిపోయిన ఎంపీ వరుణ్ గాంధీ
మొరాదాబాద్: భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మొరాదాబాద్లోని ఛాజ్లెట్ ప్రాంతంలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఆయన వేదికపై నుంచి కిందపడిపోయారు.
వివరాల్లోకి వెళితే... ఆదివారం సుల్తాన్పూర్ ఎంపీ అయిన వరుణ్ గాంధీ 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మొరాదాబాద్-హరిద్వార్ రహదారిలోని ఛాజ్లెట్ ప్రాంతంలో ఆదివారం రైతులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా వరుణ్ వేదికపైకి ఎక్కి మాట్లాడుతుండగా.. ఉన్నట్టుండి కూలిపోయింది. దీంతో ఆయనతో పాటు పలువురు నాయకులు కింద పడిపోయారు. ఈ ఘటన కారణంగా వరుణ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని మొరాదాబాద్ ఏఎస్పీ తెలిపారు.
మొరాదాబాద్ మేయర్ వీణా అగర్వాల్, తదితర నేతలు వేదికపై ఉన్నారని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీ సర్వేశ్ కుమార్ నిర్వహించారు.