రన్ వే పైకి వాహనం, గుర్తించిన పైలట్లు: టేకాఫ్ అవుతున్న విమానం ఎమర్జెన్సీ బ్రేక్
హైదరాబాద్: ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం అత్యవసరంగా రన్ వే పైన ఆగిపోయింది. విమానం టేకాఫ్ అవుతుండగా ఓ వాహనం ఆ విమానం ముందుకు వచ్చింది. దీనిని గుర్తించిన పైలట్లు విమానాన్ని వెంటనే నిలిపేశారు.
ఇండిగో ఎయిర్ బస్ ఏ320 టేకాఫ్ అవుతుండగా రన్ వే పైన ఓ వాహనాన్ని అందులోని ఇద్దరు పైలట్లు గుర్తించారు. దీంతో ఆ వాహనం ప్రమాదం నుంచి తప్పించేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు ఉపయోగించారు.
ఈ సంఘటన మంగళవారం ఉదయం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో జరిగింది. ఇండిగో విమానం ప్రతి రోజు హైదరాబాద్ నుంచి గోవాకు ట్రిప్పులు నడుపుతుంది. దీనిపై విచారణ జరుగుతోంది.
Comments
vehicle hyderabad runway indigo pilots pilot aeroplane plane వాహనం హైదరాబాద్ రన్ వే ఇండిగో పైలట్ విమానం
English summary
180 people on board an IndiGo flight had a close shave in Hyderabad after a vehicle suddenly appeared on the runway in front of the plane just as the flight was about to take off.
Story first published: Tuesday, October 9, 2018, 17:25 [IST]