వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ ఇంటికెళ్లి షాక్ తిన్న వెంకయ్యనాయుడు! ఏం జరిగిందంటే...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గుడి దగ్గరో.. లేదంటే ఇంకేదైనా రద్దీ ప్రదేశం దగ్గరో చెప్పులు పోయాయంటే అందులో వింత ఏమీ లేదు. కానీ ఓ ఎంపీ ఇంటి వద్దే పోతే, అవి సాక్షాత్తు మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడివి అయితే!

అవును.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి చెప్పులు పోయాయి. ఎక్కడో గుడి దగ్గర కాదు.. బెంగళూరులో బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఇంటి వద్ద. అసలేం జరిగిందంటే... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం బెంగళూరులో గంటన్నరపాటు జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగొచ్చారు.

Vice President's footware goes missing

అనంతరం అల్పాహారం నిమిత్తం మర్యాదపూర్వకంగా బెంగళూరులోని బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో వెంకయ్యనాయుడితోపాటు కేంద్రమంత్రి సదానంద గౌడ, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

దాదాపు గంటన్నరపాటు వారితో భేటీ అయిన తర్వాత తిరిగి వెళ్లిపోయేందుకు బయటికొచ్చిన వెంకయ్య నాయుడు షాక్ తిన్నారు. అక్కడ ఆయన విడిచిన చెప్పులు కనిపించలేదు. బహుశా ఎవరైనా పొరపాటున తన చెప్పులు వేసుకుని వెళ్లి ఉంటారని ఆయన భావించారు.

ఈలోగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయని తెలుసుకున్న సిబ్బంది సమీపంలోని చెప్పుల దుకాణానికి వెళ్లి కొత్త చెప్పులు కొని తీసుకొచ్చారు. దీంతో వాటిని వేసుకుని, తిరిగి తన మిగతా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెంకయ్య బయల్దేరారు.

English summary
Vice-president Venkaiah Naidu who visited MP PC Mohan's house in bangalore for breakfast lost his slippers. After participating in a programme, Venkaiah Naidu went to MP PC Mohan's House. After some time he came out to go further. But the problem is - his footwear missing. After knowing this, his staff immediately rushed to a nearby footwear shop and brought new footwear for him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X