వెంకయ్య నామినేషన్, 'తొలి' రికార్డ్!, స్మృతి ఇరానీకి బాధ్యతలు
వెంకయ్య నాయుడు మంగళవారం ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వెంకయ్య భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పుట్టారు.
న్యూఢిల్లీ: వెంకయ్య నాయుడు మంగళవారం ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వెంకయ్య భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పుట్టారు.
క్రియాశీలక రాజకీయాలకు వెంకయ్య దూరం: వైసిపి హ్యాపీ, టిడిపి బాధ
ఇప్పటి వరకు ఉప రాష్ట్రపతులు అందరూ స్వాతంత్ర్యం రాకముందే పుట్టారు. స్వాతంత్ర్యం వచ్చాక పుట్టిన తొలి ఉపరాష్ట్రపతిగా వెంకయ్య రికార్డులకు ఎక్కుతున్నారు.
వెంకయ్య నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన వెంట ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తదితరులు ఉన్నారు.
రాజీనామా ఆమోదం, స్మృతి ఇరానీకి బాధ్యతలు
వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించారు. దీంతో ఆయన సారథ్యం వహిస్తున్న పట్టణాభివృద్ధి శాఖను నరేంద్ర సింగ్ తోమర్కు, సమాచార, ప్రసార శాఖ బాధ్యతలను స్మృతి ఇరానీకి అప్పగించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
స్వాతంత్రం వచ్చాక పుట్టిన కొందరు ప్రముఖ నేతలు
నరేంద్ర
మోడీ:
సెప్టెంబర్
17,
1950
అరుణ్
జైట్లీ:
డిసెంబర్
28,
1952
వెంకయ్య
నాయుడు:
జులై
1,
1949
సుష్మా
స్వరాజ్:
ఫిబ్రవరి14,
1952
మాయావతి:
జనవరి
15,
1956
మమతా
బెనర్జీ:
జనవరి
5,
1955
లాలూ
ప్రసాద్
యాదవ్:
జూన్
11,
1948
అరవింద్
కేజ్రీవాల్:
ఆగస్ట్
16,
1968
జయలలిత:
ఫిబ్రవరి
24,
1948
నితీష్
కుమార్:
మార్చి
1,
1951
రాహుల్
గాంధీ:
జూన్
19,
1970
The additional charge of the Ministry of I&B has been given to @smritiirani.
— PMO India (@PMOIndia) July 18, 2017
Congrats @MVenkaiahNaidu ... The first vice-president of India to be born after Independence
— Ashok Malik (@MalikAshok) July 17, 2017