షాక్: నా కూతురిపై అత్యాచారం జరగలేదు, అక్కడ చీమకుట్టిందంతే
నాలుగేళ్ళ బాలికపై అత్యాచారం చేశారనే 20 ఏళ్ళ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసులో బాధితురాలి తల్లి వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది.తన కూతురు జననాంగం వద్ద చీమ కుట్టిందని ఆమె కోర్టుక
ముంబై: నాలుగేళ్ళ బాలికపై అత్యాచారం చేశారనే 20 ఏళ్ళ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసులో బాధితురాలి తల్లి వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది.తన కూతురు జననాంగం వద్ద చీమ కుట్టిందని ఆమె కోర్టుకు తెలిపింది.దరిమిలా ఆమె గాయాలబారినపడిందని బాధితురాలి తల్లి కోర్టుకు చెప్పడంతో కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
ముంబాయికి చెందిన నాలుగేళ్ళ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు అరెస్టు చేశారు.అయతే నిందితుడు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకొన్నాడు. అయితే బాధితురాలి తల్లి కోర్టులో ఇచ్చిన వింత వాంగ్మూలం కారణంగా నిందితుడికి బెయిల్ మంజైరైంది.
తన కూతరిపై అత్యాచారం జరగలేదని బాధితురాలి తల్లి చెప్పింది. జననాంగం వద్ద చీమ కుట్టిందన్నారు.దీంతో ఆ ప్రాంతంలో ఎర్రగా కందిపోయిందని బాధితురాలి తల్లి కోర్టుకు వివరించింది.
చీమకుట్టిన ప్రాంతంలో విపరీతంగా గోకడంతో గాయమైందన్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తే వైద్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసినట్టు బాధితురాలి తల్లి చెప్పింది.
నిందితుడు తమ కుటుంబస్నేహితుడని చెప్పారు. ఆయనే తమ కూతురిని బాగా చూసుకొంటాడని ఆమె కోర్టుకు వివరించింది. అయితే బాలిక తల్లి ఈ రకంగా వ్యవహరించడంపై పలువురు పలు రకాలుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బాలిక తల్లి సాక్ష్యంపై ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకురాకూడదని కోర్టు ఆదేశించింది.