వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ సీఎం ఎందుకు కాలేదంటే: క్లారిటీ ఇచ్చిన విద్యాసాగర రావు

తమిళనాడు రాజకీయాల్లో తాను ఆచితూచీ ముందుకు అడుగులు వేశానని ఆ రాష్ట్ర మాజీ ఇన్ చార్జ్ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తాను ఆచితూచీ ముందుకు అడుగులు వేశానని ఆ రాష్ట్ర మాజీ ఇన్ చార్జ్ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు అంటున్నారు. జయలలిత మరణించిన తరువాత తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన తన మనోగతాలను పుస్తకం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు.

తమిళనాడు ప్రభుత్వ శాసన సభ పక్షనేతగా శశికళ ఎన్నికైన తరువాత ఆమెతో ఎందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించలేదు అనే విషయంలో సీహెచ్. విద్యాసాగర్ రావు దోస్ ఈవెంట్ ఫుల్ డేస్ పుస్తకంలో వివరించారు. శశికళ ముఖ్యమంత్రి అయితే తమిళనాడు చరిత్రకే ఒక మచ్చ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Vidya Sagar Rao says about Sasikala in his book called Those Eventful Days

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో శశికళ మీద తీర్పు ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నందున తాను న్యాయనిపుణులతో ఎప్పటికప్పుడు చర్చించి ఆలస్యం చేశానని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు వివరించారు.

తొందరపడి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి చేసి ఉంటే రెండు మూడు రోజుల్లో ఆమె రాజీనామా చేసి జైలుకు వెళ్లేవారని, అదే జరిగితే తమిళనాడు చరిత్రకే ఒక మచ్చగా మిగిలి ఉండేదని సీహెచ్. విద్యాసాగర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. శశికళ విషయంలో అందుకే ఆచితూచీ ముందుకు అడుగులు వేశానని సీహెచ్. విద్యాసాగర్ రావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
Tamil Nadu Ex Governor Vidya Sagar Rao says about Sasikala in his book called Those Eventful Days which was release by Vice President of India Venkaiah Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X