వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయకాంత్కు అన్నాడీఎంకె షాక్: భార్యపై 'ఓటుకు నోటు' కేసు
చెన్నై: ప్రముఖ నటుడు, డిఎండికె చీఫ్ విజయ్ కాంత్ భార్య, మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలత పైన కేసు నమోదైంది. ఓటర్లను డబ్బులు తీసుకోవాలని ఆమె ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు నమోదు చేశారు.
ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ప్రేమలత మాట్లాడుతూ... కొన్ని పార్టీలు ఓటుకు రూ.2 నుంచి రూ.3 వేలు ఇస్తున్నారని, అలాంటి వారిని ఓటుకు లక్ష రూపాయలు ఇవ్వమని అడగండంటూ ఓటర్లకు ఆమె చెప్పారు. దీంతో తిరునెల్వేలికి చెందిన అన్నాడీఎంకే నేతలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మే 16న జరగనున్నాయి. డిఎండికె నాలుగు పార్టీలతో కూడిన పిడబ్ల్యూఎఫ్ (పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్)తో కలిసి బరిలో నిలిచింది. విజయకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థి.
Comments
tamil nadu assembly elections vijayakanth wife voters cash for vote తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు విజయకాంత్ భార్య ఓటర్లు ఓటుకు నోటు
English summary
Vijayakant's wife booked for 'instigating' voters to accept.
Story first published: Sunday, March 27, 2016, 16:52 [IST]