వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: శశికళ రాజభోగాలు లీక్ చేశాడని ఖైదీని చావబాదారు, పరిస్థితి విషమం

పరప్పన జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు వార్తలు, వీడియోలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని లీక్ చేశారంటూ జైలులోని ఓ ఖైదీని చావబాదినట్లు సమాచారం.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు.. జైలోలోనే రాజభోగాలు అందుతున్నాయన్న వార్తలు ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

రూపపై వేటు

రూపపై వేటు

ఐదు గదులతో శశికళ రాజభోగాల వీడియో కూడా లీకైంది కూడా. కాగా, శశికళ రాజభోగాలపై ఫిర్యాదు చేసిన జైళ్ల శాఖ డీఐజీ రూపపై సిద్ధరామయ్య ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, ఆమెపై బదిలీవేటు వేసింది.

లీక్ చేశారంటూ చావబాదారు

లీక్ చేశారంటూ చావబాదారు

కాగా, ఆ సమాచారం రూపకు చేరవేశాడనే కారణంతో ఓ ఖైదీని జైలర్లు చితకబాదినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరప్పన జైలు నుంచి ముగ్గురు ఖైదీలను బెళగావిలోని హిండలగా జైలుకు తరలించారు.

ఆ ఖైదీ పరిస్థితి విషమం

ఆ ఖైదీ పరిస్థితి విషమం

అక్కడికి చేరేసరికే వారిలో ఒకరైన అనంతమూర్తి పరిస్థితి విషమంగా మారింది. రక్తం గడ్డ కట్టడంతోపాటు మూత్రవిసర్జన సమస్యగా మారింది. అంతకుముందు ఆయనను పరప్పన జైలర్లు బాగా కొట్టినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం బెళగావి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతమూర్తికి చికిత్స అందిస్తున్నారు.

విచారణ

విచారణ

మరోవైపు వినయ్‌కుమార్‌ కమిటీ పరప్పన జైలులో తన విచారణ ప్రారంభించింది. అయితే, కమిటీ రావడానికి రెండు రోజుల ముందే శశికళకి కేటాయించిన ప్రత్యేక సౌకర్యాలన్నింటినీ అధికారులు హడావిడిగా తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజభోగాలు లేకుండా శశికళ సాధారణ ఖైదీగా ఉన్నట్లు సమాచారం.

English summary
A prisoner beaten for vip facilities in prison for sasikala issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X