ఆమ్ ఆద్మీ పార్టీ లోక్పాల్: దిలీప్ కుమార్ విశాఖవాసి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ లోక్పాల్గా నియమితులైన మాజీ ఐపీఎస్ అధికారి దిలీప్ కుమార్ విశాఖకు చెందిన వారు. ఏఏపీ ఆదివారం న్యూఢిల్లీలో అత్యవసర జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పార్టీ అంతర్గత లోక్పాల్ పదవి నుంచి రామ్దాస్ను తొలగించిన విషయం తెలిసిందే.
అనంతరం మాజీ ఐపీఎస్ అధికారులు ఎన్ దిలీప్ కుమార్, రాకేష్ సిన్హా, ప్రముఖ విద్యావేత్త ఎస్పీ వర్మలతో కొత్త లోక్పాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏఏపీ కొత్త లోక్పాల్ మెంబర్ దిలీప్ కుమార్ విశాఖ నివాసి. దిలీప్ కుమార్ గత ఏఏపీ ప్రభుత్వం హయాంలో యాంటీ కరప్షన్ అడ్వయిజర్గా పని చేశారు. అతను స్టింగ్ ఆపరేషన్లో దిట్ట అని తెలుస్తోంది.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీలో ఇటీవల విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఏపీ అంతర్గత లోక్పాల్ అడ్మిరల్ (రిటైర్డ్) ఎల్ రామ్దాస్తో పాటు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ నుంచి ప్రశాంత్ భూషణ్కు ఆదివారం ఉద్వాసన పలికారు.
వెన్నుపోట్లకు పాల్పడుతూ కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలతో పార్టీ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్లను శనివారం జాతీయ కార్యవర్గం నుంచి బహిష్కరించిన ఏఏపీ మరుసటి రోజే వీరిపై వేటు వేసింది.
ఏఏపీ ఆదివారం న్యూఢిల్లీలో అత్యవసర జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పార్టీ అంతర్గత లోక్పాల్ పదవి నుంచి రామ్దాస్ను తొలగించింది. అనంతరం మాజీ ఐపీఎస్ అధికారులు ఎన్ దిలీప్ కుమార్, రాకేష్ సిన్హా, ప్రముఖ విద్యావేత్త ఎస్పీ వర్మలతో కొత్త లోక్పాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏఏపీ లోక్పాల్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించేందుకు వీరంతా అంగీకరించారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా తెలిపారు.