వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ కు జైల్లో వీవీఐపీ సేవలు, రూ. 2 కోట్లు లంచం, మాజీ డీజీపీ మీద ఎఫ్ఐఆర్, బలి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ నటరాజన్ కు వీవీఐపీ సేవలు చేశారని, ప్రత్యేక గదులు కేటాయించారని వచ్చిన ఆరోపణలపై కర్ణాటక మాజీ డీజీపీ మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. డీఐజీ రూపా చేసిన ఆరోపణలు నిజమే అని వెలుగు చూడటంతో మాజీ డీజీపీ మెడకు ఉచ్చు బిగుసుకుంది.

డీఐజీ రూపా ఆరోపణలు

డీఐజీ రూపా ఆరోపణలు

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ కు రాచమర్యాదలు చేస్తున్నారని, ప్రత్యేక గదులు కేటాయించారని, ఆమెకు సేవలు చెయ్యడానికి పని మనిషి ఉన్నారని, అందు కోసం రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారని గత ఏడాది డీఐజీ రూపా ఆరోపించిన విషయం తెలిసిందే.

Recommended Video

Sasikala Roaming around Bengaluru For Shopping At MG Road Wearing a Burqa, Video
రూపా మీద డీజీపీ ఫైర్

రూపా మీద డీజీపీ ఫైర్

గత ఏడాది జైళ్ల శాఖ డీఐజీగా పని చేస్తున్న రూపా ఆకస్మికంగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు పరిశీలించడంతో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. తన అనుమతి లేకుండా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు ఎందుకు వెళ్లావు, ఎలా పరిశీలిస్తావు అంటూ డీఐజీ రూపా మీద అప్పటి జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ రావ్ మండిపడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

డీఐజీ రూపా డిమాండ్

డీఐజీ రూపా డిమాండ్

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని అక్రమాలపై విచారణ జరిపించాలని, శశికళ దగ్గర ఎవరు రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారు అని ఆరా తియ్యాలని గత ఏడాది డీఐజీ రూపా అప్పటి జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ రావ్, కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని డీఐజీ రూపా బహిరంగంగా డిమాండ్ చేశారు.

సీఎం సిద్దూ సీరియస్

సీఎం సిద్దూ సీరియస్

శశికళకు వీవీఐపీ సేవలు అందిస్తున్న విషయంలో డీజీపీ సత్యరాయణ రావ్, డీఐజీ రూపా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇద్దరూ మీడియా ముందు రచ్చకెక్కడంతో సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వం రూపా, సత్యనారాయణ రావ్ లను జైళ్ల శాఖ నుంచి బదిలి చేశారు.

చిన్నమ్మకు సేవలు

చిన్నమ్మకు సేవలు


డీఐజీ రూపా ఆరోపణలపై సీఎం సిద్దరామయ్య రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ జరిపిన వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటి ఇటీవల కర్ణాటక ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

 రంగంలోకి ఏసీబీ !

రంగంలోకి ఏసీబీ !

వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య అవినీతి నిరోదక దళం (ఏసీబీ) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ అధికారులు నివేదిక క్షుణ్ణంగా పరిశీంచారు. గత ఏడాది చివరిలో డీఐజీ రూపా ఇచ్చిన నివేదికను పరిశీలించారు.

శశికళ దెబ్బకు మాజీ డీజీపీ బలి !

శశికళ దెబ్బకు మాజీ డీజీపీ బలి !

సీఎం సిద్దరామయ్య ఆదేశాల మేరకు విచారణ జరిపిన ఏసీబీ అధికారులు కర్ణాటక మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. జైల్లో ఉన్న శశికళకు వీవీఐపీ సేవలు చేసినందుకు ఇప్పుడు మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ బలి అయ్యారు. ఇక ముందు ఎంత మంది అధికారులు బలి అవుతారో వేచి చూడాలి.

డీఐజీ రూపా క్లారిటీ

డీఐజీ రూపా క్లారిటీ

మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ మీద ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వెలుగు చూడటంతో డీఐజీ రూపా సోషల్ మీడియలో స్పంధించారు. ఆరోజు తాను ఎంతో ఆవేదనతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాను. ఇప్పుడు అది నిజం అని వెలుగు చూసింది. శశికళకు వీవీఐపీ సేవలు చేసిన ఆరోపణల విషయంలో ముగింపు సంచలనంగా ఉంటుందని అనుకుంటున్నానని డీఐజీ రూపా ట్వీట్ చేశారు.

English summary
Anti Corruption Bureau (ACB) registered a case against former DGP H.N. Sathyanarayana Rao. This comes after the allegation that Sasikala Natarajan was given special privileges during her prison term last year. D.Roopa made an allegation that Sasikala Natarajan was enjoying special treatment after she bribed top prison officials, including Sathyanarayana Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X