రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన వివరాలు ఇదిగో..!
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 4 నుంచి 5వ తేదీల మధ్య ఆయన పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే పలు ఒప్పందాలు భారత్ రష్యాల మధ్య జరగనున్నాయి. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ క్రమంలోనే ఎస్-400 మిస్సైల్ కొనుగోలుపై ఒప్పందం చేసుకోనున్నారు. భారత్ రష్యాల మధ్య 19వ ద్వైపాక్షిక చర్చలకోసం పుతిన్ భారత్ రానున్నారు.
డీల్ డన్ : భారత్ రష్యాల మధ్య మరో భారీ ఒప్పందం
ఈ చర్చల సందర్భంగా పుతిన్ పలు అంశాలను ప్రస్తావించనున్నారు. ప్రాంతీయ సమస్యల నుంచి అంతర్జాతీయ సమస్యలపై ఆయన మాట్లాడనున్నారు. ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలపై కూడా పుతిన్ ప్రస్తావించనున్నారు.
ఇక భారత్లో పుతిన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
* సాయంత్రం 6:40 గంటలకు పాలం ఎయిర్ఫోర్స్ స్టేషన్లో పుతిన్ విమానం ల్యాండ్ అవుతుంది
* సాయంత్రం 7:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో అధికారిక నివాసంలో పుతిన్ కలుస్తారు
* అక్టోబర్ 5 (శుక్రవారం)ఉదయం 11 గంటలకు హైదరాబాద్ హౌజ్లో మోడీతో భేటీ
* శుక్రవారం 11:30 గంటలకు ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు
* శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు, సంయుక్త మీడియా సమావేశం
* ఐటీసీ మౌర్య సెంట్రల్ గార్డెన్లో శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పిల్లలతో మాటామంతీ
* శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఐటీసీ మౌర్యలో భారత్ రష్యా వాణిజ్య సమావేశంలో పుతిన్ ప్రసంగం
* శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో రాష్ట్రపతి భవన్లో భేటీ
* శుక్రవారం సాయంత్రం 5:40 గంటలకు రష్యాకు తిరుగు ప్రయాణం