జియో, ఎయిర్ టెల్ దారిలో వోఢాఫోన్,ఉచిత ఆఫర్లను ప్రకటించిన వోఢాఫోన్
జియో, ఎయిర్ టెల్ తరహలోనే వోఢాఫోన్ కూడ భారీ ఆపర్లను ప్రకటించింది. తన టారిఫ్ ను మార్చింది వోడాఫోన్,.వరుసగా టెలికం కంపెనీలు వినియోగదారులకు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
న్యూఢిల్లీ :టెలికం కంపెనీలు పోటీలు పడి వినియోగదారులకు భారీ ఆపర్లను ప్రకటిస్తున్నాయి. జియో ఉచిత ఇంటర్నెట్, కాల్స్ సేవల నేపథ్యంలో ఎయిర్ టెల్ కూడ ఇదే బాటలో నడిచింది. ఈ రెండు కంపెనీల బాటలో వోడాపోన్ ను కూడ నడవనుంది. ఈ మేరకు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ల టారిఫ్ లను మార్చింది.
జియో తన సేవలను ఈ ఏడాది మార్చివరకు ఉచితంగా వినియోగదారులకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దరిమిలా ఎయిర్ టెట్ కూడ తన ప్యాకేజీల్లో మార్పులు చేర్పు చేసింది. ఇటీవలనే ఎయిర్ టెల్ తన ప్యాకేజీలను మార్చి వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించింది.
ఈ రెండు కంపెనీలు కూడ తమ వినియోగదారులకు ఆఫర్లను ప్రకటించడం తో తాజాగా వోడాఫోన్ కూడ తన టారిఫ్ లను మార్చుతున్నట్టు ప్రకటించింది.దీంతో వోడాఫోన్ రెడ్ ప్లాన్స్ లో కూడ ఇదే తరహ టారిఫ్ లను అమలు చేయనున్నట్టు ప్రకటించింది.
ఇప్పటివరకు ఉచిత కాల్స్ పై రూ.16,999 లతో రీ చార్జి చేస్తే అందించేది. కాని, ఈ ఆఫర్ ను మార్పుచేసింది. ప్రీ కాల్స్, అదనపు డాటాను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్లాన్ 1 ప్రకారంగా రూ.499 లకు లోకల్ , ఎస్ టి డి కాల్స్ , 1 జిబి డాటాను ఉచితంగా ఇవ్వనున్నారు. 2 జిబీ , 4 జిబీ డాటా, 4 జి మిబైల్స్ లో 3 జీబి డాటా ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికితోడుగా వంద ఎస్ ఎం ఎస్ లు కూడ ఫ్రీ.
ఇక ప్లాన్ రెండులో రూ.699 లోకల్, ఎస్ టి డి కాల్స్, ఐదు జీబి 4 జిబీ లేదా 2.5 జీబి డాటా ఉచితంగా ఇవ్వనున్నారు. వంద ఎస్ ఎం ఎస్ లు కూడ ఉచితంగా ఇవ్వనున్నారు.ఇక మరో మూడో ప్లాన్ లో రూ.399 ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆన్ లిమిటెడ్ కాలింగ్, 1 జిబీ 4 జిబీ డేటాతో పాటు వంద ఎస్ ఎం ఎస్ లు అదనంగా ఇవ్వనున్నారు.