వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో ఎస్పీకి షాక్.. పోలింగ్ బాయ్‌కాట్‌.. కంగుతిన్న అఖిలేశ్ సతీమణి

|
Google Oneindia TeluguNews

కన్నౌజ్ : తిరుగులేని చోట సమాజ్ వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ కుటుంబానికి షాక్ తగిలింది. ఊహించని పరిణామంతో కంగుతినాల్సి వచ్చింది. అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచిన కన్నౌజ్ సెగ్మెంట్ లో ఓటర్లు ఝలక్ ఇచ్చారు. 20 ఏళ్ల నుంచి అభివృద్ధి జరగలేదన్న కోపం ఓవైపు.. పోలింగ్ కేంద్రాలను మార్చడం మరోవైపు ఓటర్లకు ఆగ్రహం తెప్పించింది.

పంచాయతీ స్ఫూర్తి : కారు హవా.. పరిషత్ పోరులోనూ ఏకగ్రీవాల జోరుపంచాయతీ స్ఫూర్తి : కారు హవా.. పరిషత్ పోరులోనూ ఏకగ్రీవాల జోరు

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో పోలింగ్‌ను బాయ్‌కాట్‌ చేశారు ఓటర్లు. అయితే వరుసగా సమాజ్ వాదీ పార్టీయే ఇక్కడ విజయకేతనం ఎగురవేస్తుండటం ఆ పార్టీకి కంచుకోటలా మారింది. కానీ ఈసారి ఓటర్లు ఇలా రివర్స్ తిరగడం ఎస్పీ నేతలకు మింగుడుపడటం లేదు. ఇక ఇక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

 Voters in Kannauj from where Dimple Yadav is contesting boycott polls

ఓటర్ల ఆగ్రహానికి ప్రధాన కారణ పోలింగ్ కేంద్రాలు మార్చడమే. 27, 29 పోలింగ్ బూత్ లను చివరి నిమిషంలో వేరే చోటికి మార్చడంతో స్థానికుల్లో అసహనం పెరిగిపోయింది. అంతేగాకుండా 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు. అలా పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీకి వీపరీతంగా పట్టున్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి.

English summary
The voters in Kannuaj are boycotting the polls citing lack of development work and changing of polling booths in the area. The position of two booths – booth number 27 and 29 – has been shifted and only two votes have been cast since morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X