10 తరగతి గ్రూపులో బూతు వీడియోలు.. ఇంటర్నేషనల్ నంబర్తో గ్రూప్ క్రియేట్..
ఆన్లైన్ క్లాసులు ఏమో కానీ బూతు వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన తెలిసిందే. ఇప్పుడు యూపీలో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. పదో తరగతి గ్రూపులో ఆశ్లీల వీడియోలు కనిపించాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనపై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పదో తరగతి గ్రూపులో..
ఉత్తరప్రదేశ్లో భగపత్కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అయితే అతను ఇంటర్నేషనల్ నెంబర్తో బయోలజీ వాట్సాప్లో అందరినీ యాడ్ చేశారు. అయితే తర్వాత అందులో బూతు వీడియోలు పెట్టడంతో రచ్చ రచ్చ అయ్యింది. అందులో బయోలజీ టీచర్ ఫొటో కూడా ఉంచడంతో అభ్యంతరం వ్యక్తమయ్యింది.
వీడియోల గురించి చాట్
తర్వాత అసభ్యకరంగా చాట్ చేశారు. విషయం స్కూల్ ప్రిన్సిపాల్కి తెలిసింది. వెంటనే వారిని మందలించారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసును వారు సైబర్ క్రైంకు బదిలీ చేశారు. ఘటనపై వారు విచారణ జరుపుతున్నారు.
కర్నూలులో ఎనిమిదో తరగతి
కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ బాలికల హై స్కూల్లో ఘటన వెలుగుచూసింది. స్కూల్ తెరిచే పరిస్థితి లేనందున ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థినీల కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో స్టూడెంట్స్, టీచర్స్ ఉన్నారు. అయితే గ్రూపులో ఇటీవల సెక్స్ వీడియో కనిపించింది. పోస్ట్ చేసింది ఎవరో తెలియలేదు. కానీ ఆ పోస్ట్ చూసిన టీచర్లు కూడా స్పందించలేదు. దీంతో ఎవరూ పోస్ట్ చేశారు.. ఎందుకు తీయలేదు అనే ప్రశ్న వస్తోంది.
రెండురోజులు అలానే వీడియో
రెండురోజులవుతున్నా వీడియో అలానే ఉంది. టీచర్స్ కూడా పట్టించుకోకపోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు. ఎంఈవో ఆఫీసు ముందు నిరసన చేపట్టారు. దీంతో విషయం అందరికీ తెలిసింది. వీడియో పోస్ట్ చేసినవారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎంఈవో హామీనివ్వడంతో.. విద్యార్థి సంఘం నేతలు ఆందోళన విరమించారు.