ఇంటర్నెట్కు ఛార్జ్ చేయకుంటే..: ఫేస్బుక్ జుకర్ బర్గ్తో మిట్టల్
బార్సిలోనియా: ఎయిర్ టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొబైల్ కంపెనీలు.. తమ ఇంటర్నెట్ సర్వీసులకు ఛార్జీ వేయడం ఆపివేసే కంటే సామాజిక సేవ చేయడం (ఫిలాంత్రపీ) ఉత్తమమని అభిప్రాయపడ్డారు. సామాజిక అనుసంధాన వెబ్ సైట్ ఫేస్బుక్ ఇంటర్నెట్.ఆర్గ్ను లాంచ్ చేస్తోంది.
దీంతో... ఆయా టెలికాం కంపెనీ యూజర్స్ సెలెక్టివ్ వెబ్ సైట్స్ను ఉచితంగా చూడవచ్చు. దీనికి ఫేస్బుక్, సదరు టెలికం ఆపరేటర్ మధ్య సంబంధం ఉంటుందట.
ఈ ఫేస్బుక్ ఫ్రీ ఇంటర్నెట్లో ఎయిర్ టెల్ ఆఫ్రికా కూడా ఓ భాగం. రిలయన్స్ కమ్యూనికేషన్ మాత్రం ఫేస్బుక్ ఇండియాలో భాగంగా ఉంది. ప్రీ ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ మందిని ఈ వైపు ఆకర్షించాలని ప్లాన్ అని చెబుతున్నారు.
బార్సీలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో పేస్బుక్ ఫౌండర్ అండ్ సీఈవో జుకర్ బర్గ్ను మిట్టల్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోషల్ నెట్ వర్కింగ్ తన పరిధిని పెంచుకుంటే బాగానే ఉంటుందని, అయితే, టెలికం ఆపరేటర్లు కూడా తమ ఇంటర్నెట్ సేవలకు చార్జీలు వసూలు చేసేలా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఎస్సెమ్మెస్లు, వాయిస్ కాల్ రేట్లు పడిపోతున్నాయి.