టోల్ ప్లాజాలో ట్రక్ బీభత్సం: ఎస్యూవీపై బీర్ బాటిళ్ల వర్షం(వీడియో)
Recommended Video
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని కిషన్గఢ్ ప్రాంతంలో బీరు బాటిళ్లతో వస్తున్న ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. జైపూర్-అజ్మేర్ జాతీయ రహదారిపై అతి వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి కిషన్గఢ్ టోల్ప్లాజాలోని ఓ బూత్ను ఢీకొంది.
ఆ తర్వాత ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో టోల్ప్లాజా శకలాలతోపాటు ఆ ట్రక్కులో ఉన్న బీరు బాటిళ్ల పెట్టెలు ముందున్న వాహనంపై పడ్డాయి. బీరు బాటిళ్లు పగిలిపోయాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.
#WATCH A truck rams into toll plaza in Rajasthan's Kishangarh; One person was injured in the incident (21.09.2018) (Source: CCTV footage) pic.twitter.com/GcG8v3dIly
— ANI (@ANI) September 22, 2018
వెంటనే టోల్ప్లాజా సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో టోల్ప్లాజా దెబ్బతింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.