వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌంటర్ అటాక్: పాక్ బంకర్‌ను సెకన్లలో పేల్చేసిన భారత ఆర్మీ(వీడియో)

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: కాశ్మీర్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌కు చెందిన బంకర్లను భారత సైన్యం పేల్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ఇద్దరు భారత జవాన్లను పాక్‌ సైన్యం దారుణంగా హతమార్చి, వారి శరీరాల నుంచి తలలను వేరు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ వీడియో బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. 60 సెకన్లలోపే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో పాక్‌ బంకర్లను వరుసగా పేల్చేస్తుండగా 'వాటిని ధ్వంసం చేశాం' అంటూ ఓ జవాను చెప్పడం వీడియోలో రికార్డ్‌ అయింది.

ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలీదు కానీ, ఆర్మీ జవాన్ల దారుణ హత్యకు ప్రతీకారణంగానే భారత సైన్యం ఈ దాడి చేసి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. మేజర్ గౌరవ్ ఆర్య కూడా తన ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్టు చేస్టు చేశారు. ఆర్మీ వర్గాల నుంచి ఈ వీడియో వచ్చిందని, ఇది దాదాపు గత 48గంటల్లోపు జరిగిన దాడి అని ఆయన వివరించారు. పాక్‌కు తన భాషలోనే భారత్ సమాధానం చెప్పిందని అన్నారు.

మరోసారి ఉల్లంఘించిన పాక్

కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పాకిస్థాన్ విస్మరించింది. రాజౌరి, నౌషేరా ప్రాంతాల్లో పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. భారత సైనికులు వారికి ధీటుగా జవాబిస్తున్నారు.

English summary
The Indian Army Chief, General Bipin Rawat had promised action against Pakistan. In less than a week of that promise being made, the Indian Army has destroyed a major bunker of the Pakistan army at the Naushera sector at Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X