వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క బుల్లెట్ కాల్చితే ప్రతిదాడులకు దిగుతాం: పాక్‌కు రాజ్‌నాధ్ హెచ్చరిక

By Narsimha
|
Google Oneindia TeluguNews

అగర్తల: పాకిస్థాన్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా హెచ్చరించారు.సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడితే భారత్ తీవ్రంగా ప్రతి దాడులకు పూనుకొంటుందని స్పష్టం చేశారు.

త్రిపుర రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ శనివారం రాత్రి మాట్లాడారు. త్రిపుర రాష్ట్రంలో బర్జాలలో బిజెపి సభలో రాజ్‌నాధ్ మాట్లాడుతూ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు.

Watch: Rajnath Singh lambasts Pakistan on Kashmir row

సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత సైన్యం చేసే ప్రతిదాడులకు హద్దే ఉండబోదని రాజ్ నాథ్ హెచ్చరించారు. పాకిస్థాన్ ఒక్క బుల్లెట్‌ కాలిస్తే ఇండియా నుండి లెక్క లేని బుల్లెట్లు దూసుకెళ్తాయంటూ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గట్టిగా హెచ్చరించారు.

భారత్‌ పాకిస్థాన్‌ తో శాంతిపూర్వక బంధాన్ని కొనసాగించాలని అనుకుంటోంది. కానీ, వాళ్లు మాత్రం కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతున్నారుని రాజ్‌నాధ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మనం సహనంతో ఉండాల్సిన పని లేదు. సరిహద్దులో మోహరించిన సైన్యానికి ఇప్పటికే ఆదేశాలిచ్చాం. అవతలి నుంచి ఒక్క బుల్లెట​ పేలితే.. ఇవతలి నుంచి ఊహించని రీతిలో దాడి చేయాలని ఆదేశాలిచ్చినట్టు రాజ్‌నాధ్ సింగ్ గుర్తు చేశారు.

English summary
Union Home Minister Rajnath Singh on Saturday accused Pakistan of attempting to divide and destruct India. He said that Pakistan threatens to separate Kashmir from India but nobody has the courage to do so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X