ఇడ్లీ-దోశ పిండి కొంటే.... బిందేడు నీళ్లు ఉచితం...! చెన్నై వాసుల నీటీ కష్టాలకు అద్దం పడుతున్న సంఘటనలు
చెన్నైలో గత కొద్ది రోజుల నీటి కష్టాలు స్థానికులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే...గత 50 సంవత్సరాల్లోని నీటి ఎద్దడిని చెన్నై నగర వాసులు ఎదుర్కోంటున్నారు.అయితే ప్రజల నీటి కష్టాలను కొంతమంది వ్యాపారులు మరోవిధంగా సోమ్ము చేసుకుంటున్నారు..ఈనేపథ్యంలోనే తమ వద్ద కిలో ఇండ్లి పిండి కొంటే బకెట్ నీళ్లను ఉచితంగా ఇస్తామని ఓ కిరణా యజమాని ప్రకటించడం ఆక్కడి నీటి ఎద్దడి పరిస్థితికి అద్దం పడుతోంది.
చెన్నైలో నీటీ కష్టాలను వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు...తమ వద్ద వస్తువులు కొంటే నీటీని ఉచితంగా అందిస్తామని ప్రకటనలు చేస్తున్నారు..దీంతో ఆటు వ్యాపారం తోపాటు ఇటు ప్రజల నీటీ కష్టాలను కూడ తీర్చామనే ఫీలింగ్లో అక్కడి వ్యాపారులు ఉన్నారు..ఈనేపథ్యంలోనే నగరంలోని ట్రిప్లికేన్ రాఘవేంద్ర ఆలయానికి సమీపంలోని ఓ కిరణా దుకాణం వద్ద ఈ బోర్డు కనిపించింది.కాగా ప్రజలు బిందెడు నీళ్ల కోసం గంటల తరబడి వేచి ఉంటున్న పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో వారి బాధలను తీర్చేందుకు ఈ ప్రకటనను చేశానని దుకాణ యజమాని చెబుతున్నాడు.
గత ఇరవై సంవత్సరాలుగా అక్కడే వ్యాపారం చేస్తుండడంతో తన చెప్పిన సలహా మేరకు నీటిని అందిస్తున్నామని దుకాణ యజమాని పార్థసారథి చెబుతున్నాడు..అయితే నీటిని ప్రవైట్ ట్యాంకర్ ద్వార కొనుగోలు చేసి వచ్చి లాభాల్లో వినియోగదారులకు నీటీనీ సరఫరా చేస్తున్నట్టు ఆయన చెప్పారు.. అయితే దీనికి కూడ బాగా డిమాండ్ ఉండడంతో ,దుకాణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వకుండా ,వినియోగదారులకు ముందుగా ఒక గుర్తింపు కార్డు ఇస్తున్నామని కూడ ఆయన తెలిపారు. ఇక కార్డు ఉండి కిలో ఇండ్లి పిండి కొన్నవారికి మాత్రమే నీళ్లను ఉచితంగా ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.దీంతో ఆటు వ్యాపార వృద్ది పాటు ఇటు సేవ దృక్పథం ఇమిడి ఉండడంతో దీన్ని ఫాలో అవుతున్నాడు సదరు యజమాని.