వాటర్ ట్యాంకర్ స్కాం: షీలా దీక్షిత్పై ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. షీలా దీక్షిత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి, జల్ బోర్డు ఛైర్మన్ అయిన కపిల్ శర్మ పోలీసులకు సిఫార్సు చేశారు.
షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి తీవ్రత ఉన్న ప్రాంతాల్లో నీటిని సరఫరా చేసేందుకుగాను జల్ బోర్డు ద్వారా రూ.400కోట్లతో వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేసింది. అయితే ఆ కొనుగోళ్లలో షీలా దీక్షిత్ అక్రమాలకు పాల్పడినట్లు ఢిల్లీ జల్ బోర్డ్ దర్యాప్తులో తేలిందన్నారు.
అందుకే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లు కపిల్ శర్మ పేర్కొన్నారు. జూన్ 19న జల్ బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 'ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ' వేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2012లో ప్రైవేట్ కంపెనీల నుంచి 385 వాటర్ ట్యాంకులను కొనుగోలు చేశారు.