వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్, హత్య: దోషులుగా 6గురు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కాందుని ప్రాంతంలో ఓ కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో అక్కడి కోర్టు ఆరుగురిని దోషులుగా నిర్ధారించింది. వారికి కోర్టు రేపు(శుక్రవారం) శిక్ష ఖరారు చేయనుంది.

కాగా, బుధవారం తీర్పు వెలువడడానికి ముందు కోల్‌కతాలో కోర్టు బయట ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేశారు.

2013 జూన్‌లో కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని(20)ని అపహరించి గ్రామ శివారులో నిర్మానుష్య ప్రాంతంలోని ఓ కర్మాగారం ఆవరణలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను హత్య చేశారు.

West Bengal: 6 of 8 accused in Kamduni gangrape, murder case found guilty

అదే రోజు రాత్రి సోదరిని వెదుకుతూ బయల్దేరిన సోదరుడు ఆమె మృతదేహాన్ని సమీపంలోని కాలువలో గుర్తించాడు. ఈ కేసు విషయంలో రాష్ట్రంలో గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

కాగా, పోలీసులు 8 మందిపై అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. తొమ్మిదో నిందితుడు విచారణ సమయంలో జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. కేసు విచారించిన కోర్టు.. ఇప్పుడు వారిలో ఆరుగురిని దోషులుగా తేల్చింది.

English summary
Six of the eight accused in the Kamduni gangrape and murder case of West Bengal were convicted on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X