రానున్న ఎన్నికల ఖర్చు లక్ష కోట్లు...! ప్రధానికి లేఖ రాసిన సీఎం మమతా బెనర్జీ
సాధరణ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్,ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తోపాటు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు ఒకరినోకరు విమర్శలు చేసుకున్నారు. ఫలితాల తర్వాత రెండు పార్టీల మధ్య అనేక వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే...ఈ నేపథ్యంలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోడీకి ఎన్నికల సంస్కరణలపై లేఖ రాశారు.
లేఖలో భాగంగా అమే పలు విషయాలు తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల్లో జరిగే అవినీతి , అక్రమాలతోపాటు నేరాలను అడ్డుకోవాలని కోరారు. అనేపథ్యంలోనే ఎన్నికల వ్యవహారాశైలిపై సెంటర్ ఫర్ మీడీయా స్టడీస్ తయారు చేసిన నివేదికలోని అంశాలను ఆమే వెల్లడించారు. దీంతో గత పార్లమెంట్ ఎన్నికల ఖర్చు 60వేల కోట్లు దాటాయని పేర్కోన్నారు. కాగా ఇది 2014 ఎన్నికలతో పోలీస్తే రెండు రెట్లు ఎక్కువని తెలిపారు. మరోవైపు రానున్న 2024 ఎన్నికల్లో ఎన్నికల్లో లక్ష కోట్ల ఖర్చు దాటుందని అమే చెప్పారు.
కాగా ఎన్నికల నిర్వహాణ కోసం పబ్లిక్ ఫండింగ్ నేరుగా ఉంటుందని ఇలా 69 దేశాల్లో డైరక్ట్ ఫండింగ్ ఉండగా మరో 79 దేశాల్లో ఇన్డైరక్ట్ ఫండిండ్ విధానం ఉందని పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే ఎన్నికల ఖర్చుపై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆమే ప్రధానిని కోరారు. ప్రభుత్వ నిధులతో ఎన్నికల ఖర్చు నిర్వహించే విధంగా సంస్కరణలు చేపట్టాలని ఆమే సూచించారు.