వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు: కోర్టు మూసివేత

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పేల్చేస్తామని బెదిరింపు లేఖ రావడంతో కార్యకలాపాలన్నీ నిలిపేసి న్యాయస్థానం భవనాన్ని మూసేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్‌గురిలో చోటుచేసుకుంది.

జల్పాయ్‌గురి జిల్లా కోర్టుకి నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ బోడోల్యాండ్‌(ఎన్డీఎఫ్‌బీ) నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. కోర్టు భవనంలో మూడు బాంబులు అమర్చినట్లు, సమీపంలో మరో రెండు బాంబులు అమర్చినట్లు బెదిరింపు లేఖ వచ్చిందని బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీ అవినందన్‌ చటర్జీ తెలిపారు.

West Bengal: Jalpaiguri district court stops function after receipt of threat letter

పోలీసులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు వెంటనే కోర్టును ఖాళీ చేయించి, పోలీసు జాగిలాలు, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి బాంబులు అక్కడ లభించలేదు.

బెదిరింపు లేఖను, సంఘటను సీరియస్‌గా తీసుకొని విచారణ చేపడుతున్నామని, ఉగ్రవాదులతో లేఖకు సంబంధం ఉందా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ ఆకాశ్‌ మేఘారియా పరిశీలించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడతామని ఆయన తెలిపారు.

English summary
All works in the Jalpaiguri district court came to a standstill on Friday after a letter claiming to have been sent by the NDFB reached the court office earlier in the day threatening to blow up the court building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X