మమతా బెనర్జీ గెలిస్తే.. నాలుగు రికార్డ్లు సృష్టిస్తారు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మమతా బెనర్జీయే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. మమతా బెనర్జీ మరోసారి గెలిస్తే పలు రికార్డులు ఆమె వశం కానున్నాయి.
మమతా బెనర్జీ మరోసారి గెలిస్తే... వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. ఇలా ఆమె రెండోవారు అవుతారు. అలాగే మహిళా ముఖ్యమంత్రుల్లో ఆమె మొదటివారు అవుతారు.
ఆమె కంటే ముందు ప్రఫుల్ చంద్ర ఘోష్, బిధాన్ చంద్ర రాయ్, అజయ్ కుమార్ ముఖర్జీ, జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్యలు ముఖ్యమంత్రులుగా రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు పని చేశారు.
గత 39 ఏళ్లలో పార్టీల పరంగా రెండుసార్లు మాత్రమే అధికార మార్పిడి జరిగింది. 1977లో కాంగ్రెస్ పార్టీ నుంచి లెఫ్ట్ అధికారం చేజిక్కించుకుంది. 2011లో లెఫ్ట్ నుంచి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది.
మమతా బెనర్జీ మరోసారి గెలిస్తే... 1962 తర్వాత సింగిల్ పార్టీగా గెలిచిన ఏకైక పార్టీగా తృణమూల్ చరిత్ర సృష్టించనుంది. 1962లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 152 సీట్లు గెలిచింది.
మమతా బెనర్జీ మరోసారి గెలిస్తే..లెఫ్ట్ పార్టీలకు మొత్తంగా నాలుగోసారి ఆమె చేతిలో చావు దెబ్బ అని చెప్పవచ్చు. 2009 లోకసభ ఎన్నికల్లో, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో, 2014 లోకసభ ఎన్నికల్లో లెఫ్ట్ను మమతా బెనర్జీ చావుదెబ్బ కొట్టారు.
మమతా బెనర్జీ ఓడిపోయి, కాంగ్రెస్-లెఫ్ట్ మిత్రపక్షాలు అధికారం చేజిక్కించుకుంటే సంప్రదాయంగా ఉండే శత్రువులు కలిసి ప్రభుత్వాన్ని ఫాం చేయడం రాష్ట్రంలో ఇది తొలిసారి అవుతుంది.