ఏమిరా వారీ.. పదేళ్లు కష్టపడి జైలుపాలైతిరి గదరా..! అమెరికా నా..? మజాకా..?
హైదరాబాద్ : అంతా అద్బుతంగా చేసారు. కాలంతో పాటు సాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. అసాద్యాన్ని సుసాద్యం చేసుకున్నారు. అనుకున్న దానికంటే విపరీతంగా లాభాలు గడించారు. అంతోనే కక్కుర్తి పడి కటకటాల పాలయ్యారు. అజయ్ బ్రత్వాల్, దిలీప్ నైక్, భావేష్ మిస్త్రీలు అనే ముగ్గురు భారతీయులు మంచి స్నేహితులు. అమెరికాలో స్థిరపడ్డారు. తెలివి తేటలకు, తెగింపుకు ఎలాంటి కొరత లేదు. సొంతంగా కంపెనీ నెలకొల్పి బాగా పనిచేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. కష్టపడ్డారు.
ఓట్ల చేర్పు,తీసివేతలకు కొలమానం ఉందా..?కౌంటర్ దాఖలు చేయాలని ఈసీ కి హైకోర్ట్ ఆదేశం..!!
వారి ఆశయం నెరవేరింది. కోట్ల సంపాదించాలన్న వారి కల నెరవేరింది. కంపెనీ ఊహించని లాభాల బాటలో పయనించింది. ఒకటికి రెండు బ్రాంచీలు కూడా అనతి కాలంలోనే ఏర్పాటయ్యాయి. న్యూజెర్సీ, నెవార్క్, న్యూయార్క్ నగరాల్లో కంపెనీ విస్తరించింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో వారిలో నిద్రిస్తున్న కక్కుర్తి ఒక్కసారిగా మేల్కొంది. షాట్ కట్ చేస్తే, ఇపుడుఆ మిత్ర త్రైయం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఎందుకు..? ఎలా..?
పదేళ్లుగా కష్టపడి జైలుకు వెళ్లిన చందంగా తయారయ్యింది మనవాళ్ల పరిస్థితి. పదేళ్లుగా వారు చేసిన తప్పును పట్టుకుని విచారించి శిక్ష వేశారు. ఆదాయపన్ను ఎగ్గొట్టిన కేసులో ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. ఇంతకీ మనవాళ్లు నెలకొల్పిన ఫార్మసీ కంపెనీ ద్వారా 9 మిలియన్ డాలర్లు లాభం రాగా... వారు కేవలం 4 మిలియన్ డాలర్లు మాత్రమే లాభం వచ్చినట్లు ప్రభుత్వానికి చూపారు. మిగతా సొమ్ము చెక్కుల ద్వారా 2 అక్కౌంట్స్ లో వేసుకున్నారు. వారి ఆటలు ఎంతో కాలం సాగలేదు. అన్ని తెలివితేటలు ఉండి... లాభాలు సంపాదించి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఏమిరా వారీ.. ఎంత పని సేసితివిరా.. ! మీ కక్కుర్తిలో కమండలం..!!