చిదంబరం అరెస్ట్... 26 గంటలు ఏం జరిగింది.. మినిట్ టూ మినిట్
కేంద్రమాజీ మంత్రి పీ.చిదంబరం అరెస్ట్ అయ్యాడు. పార్టీ కార్యాలయం నుండి నేరుగా ఇంటికి చేరుకున్న చిదంబరం ను సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు... అంతకుముందు చిదంబరం ఇంటి ముందు హైడ్రామా నెలకోంది. సిబిఐ, ఈడీ అధికారులు, ఆయన ఇంటికి చేరుకున్నారు. చిదంబరం ఇంటికి వెళ్లిన అధికారులను ఆయన వ్యక్తిగత సిబ్బంది లోపలికి అనుమతించలేదు... దీంతో వారు గోడదూకి మరి ఇంట్లోకి వెళ్లారు. అయితే చాల సేపటివరకు చిదంబరం ఇంట్లోకి వెళ్లలేక పోయారు. సిబిఐ మాత్రం ఇంటి అవరణలోనే వేచి ఉండి ఆయనతో మాట్లాడిన తర్వాత అదుపులోకి తీసుకుంది. ఇంటి నుండి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లిన అధికారులు అన్ని పరీక్షల అనంతరం ఆయన అరెస్ట్ను అధికారికంగా ధృవికరించారు. కాగా రాత్రంతా సీబీఐ కేంద్రకార్యాలయంలోనే ఉంచనున్నారు. వీలైనంత వరకు ఆయన్ను విచారించన్న సీబీఐ, కాగా రేపు సీబీఐ కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు.
కాగా మంగళవారం డిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన తర్వాత సాయంత్రం 6.30కి సుప్రింకోర్టు ఆవరణలో ఉన్న చిదంబరం... అనంతరం బుధవారం రాత్రి అకస్మాత్తుగా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.
బుధవారం
రాత్రి
8.10
నిమిషాలకు
ఏఐసీసీ
కార్యాలయానికి
చేరుకున్న
పీ.చిదంబరం
8.14pm
కు
ప్రెస్మీట్
ప్రారంభం
8.21pm
ప్రెస్మీట్
ముగింపు
8.26pm
కు
కాంగ్రెస్
పార్టీ
కార్యాలయం
నుండి
బయలు
దేరిన
చిదంబరం
8.40Pm
కు
ఇంటికి
చేరుకున్న
చిదంబరం
8.50pm
చిదంబరం
ఇంటికి
చేరుకున్న
సీబీఐ,ఈడీ
అధికారులు
8.55pm
వరకు
ఇంటి
గేటు
ముందే
వేచి
ఉన్న
అధికారులు,
అనంతరం
గేటులోపలికి
దూకిన
సిబిఐ
అధికారులు
9.00pm
మరో
సీబీఐ
టీం
చిదంబరం
ఇంటికి
9.45pm
చిదంబరంను
ఇంటినుండి
తీసుకెళ్లిన
అధికారులు
10.20pm
అధికారిక
అరెస్ట్
చేశామని
ధృవికరించిన
సీబీఐ