వాట్సాప్ మళ్లీ క్రాష్ : అయ్యో ఎలా ?
Recommended Video
ఆ మధ్యన సాంకేతిక కారణాల వల్ల కాసేపు పని చేయకుండా పోయిన వాట్సాప్.. తాజాగా ఈ ఉదయం(శుక్రవారం) మరోసారి అటకెక్కింది. మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనదిగా మారిపోయింది వాట్సాప్. ఎవర్ని కదిపినా వాట్సాప్ తెలిసిన వాళ్ళే తప్ప తెలియని వాళ్ళు చాలా అరుదు. ఫోన్ చెక్ చేసే ప్రతిసారీ వాట్సాప్ చెక్ చేయడం అలాగే స్టేటస్ పెట్టడం, వేరే వాళ్ళ స్టేటస్ చూడటం జీవులకు ఇప్పుడో అలవాటుగా మారిపోయింది. అయితే మెసేజింగ్ సర్వీసుల దిగ్గజమైన వాట్సాప్ నిన్న మళ్లీ మొరాయించింది. సాంకేతిక కారణాల వల్ల కాసేపు పని చేయకుండా పోయింది. వాట్సాప్ ను యూజ్ చేసేటప్పుడు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా పలువురు పేర్కొన్నారు. కొన్ని గంటల పాటు సర్వీసు పని చేయనట్లుగా తెలుస్తోంది. అనంతరం సర్వీసులు పునరుద్ధరణ జరిగినట్టు యూజర్లు తెలిపారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల నుంచి వాట్సాప్డౌన్ అనే ట్వీట్స్ పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. రిపోర్టుల ప్రకారం ఉత్తర యూరప్, బ్రెజిల్లో ఈ సమస్య ఎక్కువగా ఏర్పడిందని తెలిసింది. ఇండియా మీద తాజా క్రాష్ ప్రభావం లేదన్న మాట వినిపిస్తోంది.
అయితే దీనిపై వాట్సాప్ ప్రతినిధి ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారు: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు సేవకు ఇబ్బంది కలిగిందని, అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి అని అలాగే కంపెనీ సమస్యను గుర్తించే పనిలో ఉందని పేర్కొన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా 1.3 బిలియన్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ కు భారత్ లో 200 మిలియన్ల యూజర్లు ఉన్నారు, ఇక ఈ మెసేజింగ్ దిగ్గజం, తన యాప్పైకి ఎక్కువ సర్వీసులను తీసుకురావాలని చూస్తోంది.