మీకు తెలియకుండానే మీ వాట్సప్ స్టేటస్లో ప్రకటనలు.. 2020నుండి అమలు చేయనున్న యాజమాన్యం
ఫోన్ వినియోగదారుల్లో వాట్సప్ యాప్ కమ్యునికేషన్ రంగంలో కొత్త మార్పును తీసుకువచ్చింది. వాట్సప్ లేకుండా ఏ వినియోగదారుడు లేనిపరిస్థతిని కల్పించింది. ఈనేపథ్యంలోనే వ్యక్తిగత సమాచారంతో పాటు సామాజిక పరమైన అంశాలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. కొన్ని సంధర్భాల్లో వాట్సప్ ద్వార తప్పుడు వార్తలు వెలువడి గందరగోళానికి గురయిన సంధర్భాలు కూడ ఉన్నాయి. ఇదంతా వినియోగదారులకు ఉచిత యాప్ ద్వార పలు సేవలు అందిస్తుది. గతంలో వాట్సప్ వినియోగదారులు సంవత్సరానికి 50 రుపాయలు చెల్లించాల్సి ఉంటుందనే వార్తలు కూడ వెలువడ్డాయి. అయితే అవి మాత్రం అమలు కాలేదు.
అయితే ఇన్నాళ్లు ఉచితంగానే వినియోగదారులకు సేవలు అందించిన వాట్సప్ యాజమాన్యం భవిష్యత్లో వాట్సప్ యాడ్స్ను ప్రవేశ పెట్టనుట్టట్లు ప్రకటించారు.ఇటివల జరిగిన ఓ సదస్సులో వాట్సప్ యాజమాన్యం తెలిపింది. దీంతో 2020 నుండి వాట్పప్లో ప్రకటనలు వెలువడుతాయని చెబుతున్నారు. అయితే యాడ్స్ మాత్రం వినియోగదారుల స్టేటస్లలో దర్శనివ్వనున్నాయి. కాగా ఇందుకు సంబంధింది సుమారు 500 బిలియన్ డాలర్ల వ్యాపారం కొనసాగుతుందని ప్రకటించింది.