వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ముక్త్ భారత్‌తోనే పేదరిక నిర్మూలన : రాజ్‌నాథ్ సింగ్

|
Google Oneindia TeluguNews

కోల్ కతా : దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసిందేమి లేదని విమర్శించారు. ఆ పార్టీ విధానాల వల్లే దేశం అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ఆయన బెంగాల్‌లోని హావ్డాలో గురువారం ప్రచారం నిర్వహించారు.

 when congress mukth in india there will be no poverty

ఇంకెన్నాళ్లీ హామీలు
ఎన్నికల వేళ న్యాయ్, పేదరిక నిర్మూలన అంటూ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు మసిపూసి మారేడు కాయ చేయడమేనని ఆరోపించారు. నెహ్రూ హయాం నుంచి పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తోంది. ఇంకెన్నాళ్లు ఈ హామీల కబుర్లు చెబుతారని ప్రశ్నించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి దేశం విముక్తి పొందిన రోజే పేదరిక సమస్య పరిష్కారమవుతోందన్నారు రాజ్‌నాథ్ సింగ్.

విపక్షాలపై హింసనా ?
పనిలో పనిగా బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు రాజ్‌నాథ్ సింగ్. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉనికి కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీలపై హింస కొనసాగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీకి అధికారం కట్టబెడితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించేందుకు పోరాడుతామని హామీనిచ్చారు.

English summary
Union Minister Rajnath Singh criticized Congress for poaching in the country. Since independence, the Congress party has been criticized for not doing anything for the poor. By the policies of the party, the country has slowed its growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X