డబ్బు కోసం వ్యభిచారం చేయమన్న బాయ్ ఫ్రెండ్, ఆమె ఏం చేసిందంటే..
ఏడాది కాలంగా తనతో సహజీవనం చేస్తున్న బాయ్ఫ్రెండ్ డబ్బు కోసం వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తుండడంతో భరించలేక ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో జరిగింది.
న్యూఢిల్లీ : ఏడాది కాలంగా తనతో సహజీవనం చేస్తున్న బాయ్ఫ్రెండ్ డబ్బు కోసం వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తుండడంతో భరించలేక ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బడాన్ ప్రాంతానికి చెందిన నీరజ్ ట్యాక్సీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. నీరజ్ కు రేష్మా అలియాస్ దీప్తీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనం దాకా వెళ్లింది.
షాకింగ్: పోలీసుల కీచక పర్వం, మైనర్ బాలికను గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి...
ఏడాదికాలంగా నీరజ్, రేష్మాలిద్దరూ దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలోని ఓ ఫ్లాటులో అద్దెకు ఉంటూ సహజీవనం చేస్తున్నారు. డబ్బు సంపాదించేందుకు రేష్మాను వ్యభిచారం చేయాలని నీరజ్ ఒత్తిడి చేశాడు.
దీంతో రేష్మా భరించలేక సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన నీరజ్ ఫ్లాటుకు వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో స్థానికుల సహకారంతో తలుపు పగులగొట్టి చూడగా రేష్మా మృతదేహం కనిపించింది.
స్నేహితులే కీచకులై.. బహిర్భూమికి వెళుతుంటే.. వెంటాడి..
పోలీసులు వచ్చి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, అక్కడ ఉన్న సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. బాయ్ఫ్రెండ్ వ్యభిచారం చేయమని వేధిస్తున్నందునే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రేష్మా తన సూసైడ్ నోట్ లో రాసింది. రేష్మా ఆత్మహత్యకు కారణమైన నీరజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.