వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆనందం: ముస్లింల కోసం మసీదు కట్టించిన సిక్కులు
భారత్లో మత సామరస్యం ఇంకా ఉందనిన చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ. పంజాబ్ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామం సర్వాపూర్. ఈ గ్రామంలో ముస్లింలు నమాజు చేసుకోవడానికి సిక్కులు ఓ మసీదు కట్టించారు.
ఆ గ్రామంలోని ముస్లింలు నమాజు కోసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్లేవారు. ఇదంతా చూసి బాధపడ్డ ఆ గ్రామంలోని రైతు జోగా సింగ్ మసీదు నిర్మించేందుకు ముందుకొచ్చాడు. అలా జోగా సింగ్ తీసుకున్న నిర్ణయం అక్కడి ముస్లింలను ఎంతో ఆనందానికి గురి చేసింది.
నిజానికి ఆ గ్రామంలో మసీదు ఉంది. అయితే ఎప్పుడో గతంలో తలెత్తిన ఘర్షణల్లో దానిని కూలగొట్టారు. "సిక్కు సోదరులే అండగా నిలవకుంటే, మేము ఎన్నడూ ఈ గ్రామంలో మసీదును నిర్మించుకుని ఉండేవాళ్లం కాదు" అని గ్రామ నివాసి మహమ్మద్ జమీల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Comments
English summary
In a perfect gesture of humanity, Sikhs from of a small village of Sarwapur, Punjab built a mosque for the Muslim residents.
Story first published: Friday, September 11, 2015, 16:07 [IST]