కన్నీళ్లు ఆపుకోలేకపోయిన యోగి: పాటకు చలించిపోయి.. తీవ్ర భావోద్వేగంలో..
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టుకున్నారు. దీపావళి సందర్భంగా నిర్వహించిన 'ఏక్ దియా- షాహీదోం కే నామ్' (వీరుల పేరిట ఓ దీపం) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.స్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టుకున్నారు. దీపావళి సందర్భంగా నిర్వహించిన 'ఏక్ దియా- షాహీదోం కే నామ్' (వీరుల పేరిట ఓ దీపం) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
స్వాతంత్ర్య సమర యోధులను గుర్తుచేసుకుంటూ సాగిన కార్యక్రమంలో.. ఒక పాట విని యోగి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. సీఎం అలా కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చాలామంది ఆశ్చర్యంగా చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కార్యక్రమం అనంతరం యోగి ఆదిత్యనాథ్ చిన్నపిల్లలకు స్వీట్లు, పండ్లు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. వంతంగియా వర్గానికి చెందిన కొందరు దివ్యాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. గోరఖ్పూర్లోని వంతంగియా వర్గానికి లబ్ది చేకూర్చేలా ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, క్రీడా మైదానాలు, తాగునీటి వసతి సహా పలు ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.