ప్రత్యేక హోదా నిధులు ఎక్కడనుండి తెస్తారు : అరుణ్ జైట్లీ
బీజేపి ప్రభుత్వం, ఏపికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని సీఎం చంద్రబాబు అంగీకరించారని అనంతరం ఆయన కేంద్రానికి లేఖ కూడ రాశారని గుర్తు చేశారు కేంద్రమంత్రి ఆరుణ్ జైట్లీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. కాగా ఏపి ఆమోదించిన ప్యాకేజీ ప్రకారం నిధులు అందుతాయని ఆరుణ్ జైట్లీ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతుందని , ప్రత్యేక హోదాకు నిధులు ఎక్కనుండి తెస్తుందని ఆయన ప్రశ్నించారు. కాగా తమ రాష్ట్రాలకు సైతం ప్రత్యేక హోదా కావాలని ఒడిశా తో సహ అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. మరోవైపు కాంగ్రేస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పై ఆయన స్పందించారు. మ్యానిఫెస్టో దేశాన్ని విభంచడంతో పాటు చాల ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యనించారు.ఈ నేపథ్యంలోనే ఏపి ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.