పొంచిఉన్న మరో 'భారీ' భూకంపం: నేపాల్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ తీవ్రత
న్యూఢిల్లీ: నేపాల్లో వచ్చిన భూకంపం ప్రపంచాన్ని కదిలించింది. ఇప్పుడు నేపాల్లో వచ్చిన భూకంపై తీవ్రత 7.9గా ఉంది. త్వరలో మరో భారీ భూకంపం వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2018కి అటు ఇటుగా ఈ భారీ భూకంపం ఉండవచ్చునని చెబుతున్నారు.
ఈ భూకంపం కూడా సెంట్రల్ హిమాలయాల్లో ఉండవచ్చునని చెబుతున్నారు. తదుపరి ఆ భారీ భూకంపం హిమాలయాల్లోనే ఉండవచ్చునని, దాని ప్రభావం బాగా ఉంటుందని చెబుతున్నారు. నేపాల్లో వచ్చిన భూకంపం తీవ్రత 7.9గా ఉందని, తదుపరి వచ్చే భారీ భూకంపం తీవ్రత 9గా ఉండవచ్చునని అంటున్నారు.
నేపాల్లో వచ్చిన భూకంపానికి 40 రెట్లు ఆ భారీ భూకంపం ఉండవచ్చునని అంటున్నారు. ఈ భారీ భూకంపం ప్రపంచంలో ఎక్కడైనా రావొచ్చునని, ప్రధానంగా సెంట్రల్ హిమాలయాల్లో రావొచ్చునని అంటున్నారు. భారీ భూకంపం వస్తే హిమాలయ పరిసరాలు దెబ్బతింటాయి.
హిమాచల్ ప్రదేశ్ నుండి వెస్ట్ నేపాల్ వరకు దీని ప్రభావం పడవచ్చునంటున్నారు. అయితే, కచ్చితంగా ఆ భూకంపం ఎప్పుడు వస్తుందో మాత్రం అప్పుడే చెప్పలేమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లేదా పదేళ్ల తర్వాత రావొచ్చని చెప్పారని సమాచారం.