వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటపడ్డ 900 ఏళ్ల నాటి బంగారు నాణేలు

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కొండగావ్ జిల్లాలో సుమారు 900ఏళ్ల నాటి బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని 12వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. రాష్ట్రంలోని కొండగావ్‌ జిల్లాలో కోర్‌కోటి, బెద్మా అనే రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం కోసం తవ్వగా పురాతనం కాలం నాటి కుండ బయటపడింది. అందులో 57 బంగారు నాణేలు, ఓ వెండి నాణెం, బంగారపు చెవిదిద్దు ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ నీల్‌కేతన్‌ వెల్లడించారు.

While Digging Earth, Labourer Finds Pot Of 900-Year-Old Gold Coins

జులై 10న అవి బయటపడగా కోర్‌కోటి సర్పంచి నెహ్రూలాల్ బాగెల్‌ శనివారం వాటిని కలెక్టర్‌కు అప్పగించారు. రోడ్డు నిర్మాణ సమయం ఓ మహిళా కూలీ ఈ కుండను గమనించి తోటి వారికి చెప్పగా విషయం గ్రామస్థులకు చేరిందని సర్పంచి తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ నాణేలు 12 లేదా 13వ శతాబ్దం నాటివని తెలుస్తోందని కలెక్టర్‌ తెలిపారు.

నాణేలపై ఉన్న గుర్తులను గమనిస్తే అవి పూర్వం విదర్భ ప్రాంతాన్ని పరిపాలించిన యాదవుల కాలంలోనివిగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలోని ఏడు జిల్లాలను కూడా అప్పట్లో యాదవుల పాలనలోనే ఉండేవని చెబుతున్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల నాణేలను పూర్తిగా పరిశీలిస్తారని కలెక్టర్‌ నీల్ కేతన్ తెలిపారు.

English summary
Gold coins belonging to the 12th century have been found during earth-digging for a road construction in Chhattisgarh's Kondagaon district, officials today said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X