బీజేపీ ఎమ్మెల్యే చేతిలో అత్యాచారానికి గురైన యువతికి కారు ప్రమాదం... ఇద్దరు మృతి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో ఘటనలో అత్యాచార బాధితురాలు సహ ఆమే లాయర్ బంధువులు వెళుతున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఇద్దరు చనిపోగా అత్యచార బాధితురాలితో సహ ఆమే అడ్వకేట్కు తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. రాయ్బరేలీ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న యువతి బంధువును కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర జరిగిందని యూపీ ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అరోపణలు చేశారు. భాదితురాలిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని అన్నారు. ఈనేపథ్యంలోనే ప్రమాదంపై సీబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.మరోవైపు ఈ ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని భాదితురాలి కుటుంభ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం వెనక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ ఉన్నారని ఆరోపణలు చేశారు.
2017 లో ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువతిపై భాజపాకు చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్, అతడి అనుచరులు కలిసి అత్యాచారం చేశారని, ఆ యువతి ఆరోపించింది. ఆ తరవాత ఆ యువతి తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోవడం యూపీలో చర్చనీయాంశమైంది. అయితే అత్యాచారం జరిగిన తర్వాత తనకు న్యాయం చేయాలంటూ యూపి సీఎం అధిత్య నాధ్ ఇంటి ముందు యువతి ధర్నాకు దిగడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్, అతడి సోదరుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు.