Drugs mafia:ఆంధ్రా నుంచి డ్రగ్స్, ఎవరా పొలిటికల్ లీడర్ ? అరెస్టు చేస్తారా ? లేదా ? నటి రమ్యా !
బెంగళూరు/ అమరావతి/ ముంబాయి: కర్ణాటకతో పాటు స్యాండిల్ వుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ మాఫియా కేసులో ప్రముఖ నటి సంజనా అరెస్టు అయిన తరువాత పలువురు సెలబ్రిటీలు హడలిపోతున్నారు. ఇప్పటికే నటి రాగిణి ద్వివేది అరెస్టు అయిన విషయం తెలిసిందే. స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా అరెస్టు అయిన తరువాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ చీఫ్, మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన బెంగళూరు పోలీసులను ఉద్దేశించి చేసిన ట్విట్ కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నుంచి కంటేనర్ లో బెంగళూరుకు డ్రగ్స్ వచ్చాయని పోలీసులు అంటున్నారు. ఆ కంటేనర్ ప్రముఖ పొలిటీషియన్ ది అని పోలీసులు చెబుతున్నారు ? ఆ రాజకీయ నాయుడిని అరెస్టు చేస్తారా ? లేదా ? అంటూ నటి రమ్యా నేరుగా బెంగళూరు పోలీసులకు ట్విట్ చెయ్యడం కలకలం రేపింది.
TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !
204 కేజీల డ్రగ్స్ సీజ్
ఆగస్టు చివరి వారంలో బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) కోటి రూపాయలకు పైగా విలువైన 204 కేజీల మరిజువానా డ్రగ్స్ ను బెంగళూరు నగర శివారల్లోని దేవనహళ్ళి సమీపంలో స్వాధీనం చేసుకున్నామని అప్పట్లో చెప్పారు. దేవనహళ్ళిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అప్పుడే నటి అనికాతో సహ ముగ్గురిని అరెస్టు చేశారు.
అంధ్రప్రదేశ్ టూ బెంగళూరు !
ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నుంచి మరిజువానా డ్రగ్స్ కంటేనర్ లో లోడ్ చేసుకుని బెంగళూరు వస్తున్న సమయంలో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని, ఆ కంటేనర్ ప్రముఖ రాజకీయ నాయకుడదని ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించిందని ఆ పేపర్ క్లిప్పింగ్స్ ను జత చేసిన మాజీ ఎంపీ, ప్రముఖ నటి రమ్యా ట్వీట్ చేశారు. నటి రమ్యా చేసిన ట్విట్ కు బెంగళూరు పోలీసులను లింక్ చేశారు.
ఎవరా పొలిటీషియన్ ? అరెస్టు చేస్తారా
డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కంటేనర్ (ట్రక్కు) ప్రముఖ రాజకీయ నాయకుడిది అని పోలీసులు చెప్పారని ఆ ఆంగ్ల పత్రిక కథనం వెళ్లడించింది, అయితే ఆ రాజకీయ నాయకుడి పేరు మాత్రం అందులో ప్రచురించలేదు, ఆ పొలిటిక్ లీడర్ పేరుతో ట్రక్కు రిజిస్టర్ అయ్యిందని ఇంగ్లీష్ పత్రికలో కథనం వెలువడిందని రమ్యా అంటున్నారు. ఆ ఇంగ్లీష్ పత్రిక కథనం క్లిప్పింగ్ ను జత చేసిన నటి రమ్యా ఆ రాజకీయ నాయకుడిని అరెస్టు చేస్తారా ? అంటూ సోషల్ మీడియాలో బెంగళూరు పోలీసులను సూటిగా ప్రశ్నించారు.
స్యాండిల్ వుడ్ ను శాసించాలని ప్రయత్నం ?
స్యాండిల్ వుడ్ ను డ్రగ్స్ మాఫియా కేసు కుదిపేస్తోంది. స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖులు మరణించిన తరువాత ఓ పొలిటికల్ లీడర్ స్యాండిల్ వుడ్ ను శాసించాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే స్యాండిల్ వుడ్ కు డ్రగ్స్ ను పరిచయం చేశారని, కన్నడ సినిమా పరిశ్రమకు బాస్ కావాలని ఆ పోలిటికల్ లీడర్ ప్రయత్నిస్తున్నారని, ఆ పొలిటికల్ లీడర్ తో కొందరు బీజేపీ నాయకులు సన్నిహితంగా ఉన్నారని ఇంగ్లీష్ పత్రిక కథనం ప్రచురించిందని నటి రమ్యా సోషల్ మీడియాలో ఆరోపించారు.
కలవరపెడుతున్న డ్రగ్స్ మాఫియా !
స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చెయ్యడంతో డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉన్న కొందరు సెలబ్రిటీలు, వీఐపీలు హడలిపోతున్నారు. ఇదే సమయంలో డ్రగ్స్ మాఫియాకు కొందరు రాజకీయ నాయకులకు లింక్ ఉందని ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్యా ఆరోపించడం కలకలం రేపింది. రాగిణి, సంజనా అరెస్టు కావడంతో ఇంకా ఎంతమందిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేస్తారు ? అనే విషయం అంతుచిక్కడం లేదని కొందరు సెలబ్రిటీలు అంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, ప్రముఖ నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన డ్రగ్స్ మాఫియా గురించి చేసిన ట్విట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.