వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా తల్లిదండ్రులెవరని ప్రశ్నిస్తోందీ సిగ్గులేని కాంగ్రెస్: మోడీ నిప్పులు

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్‌: కాంగ్రెస్ పార్టీ తనపై చేస్తున్న విమర్శలకు ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందిస్తున్నారు. తనను నీచమైన వ్యక్తి అంటూ కాంగ్రెస్‌ పార్టీ నేత మణిశంకర్‌ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డారు.

కాగా, తాజాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కీలక అనుచరుడైన సల్మాన్‌ నిజామీ చేసిన వ్యాఖ్యలపైనా మోడీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సల్మాన్‌... తన తల్లిదండ్రులు ఎవరని ప్రశ్నిస్తున్నారని, అసలు అలాంటి భాష ఉపయోగించవచ్చా? అని మోడీ ప్రశ్నించారు.

 Who is your mother, father?,Congress worker asks PM Modi

'నా తండ్రి, తల్లి ఎవరని కాంగ్రెస్‌ పార్టీ నన్ను ప్రశ్నిస్తోంది. నా సోదరీసోదరులారా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను.. అలాంటి భాషను మనం శత్రువుల విషయంలోనైనా ఉపయోగిస్తామా? కానీ, ఒక బాధ్యతగల కాంగ్రెస్‌ పార్టీ నేత నన్ను ఇలా అడిగారు' అని మోడీ ధ్వజమెత్తారు.

'రాహుల్‌గాంధీ పార్టీ నా తల్లిదండ్రులెవరని ప్రశ్నిస్తోంది. ఈ దేశ ప్రజలే నా తల్లిదండ్రులు. నేను ఈ భూమిపుత్రుడిని.. ఈ లునావాడ బిడ్డను. భాష విషయంలో, పనుల విషయంలో మాటల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సిగ్గును వదిలేసింది. ఆ పార్టీ ఓటమి అంచుల్లో ఉంది. ఎన్నో అబద్ధాలు ప్రచారం చేస్తుంది. అలా అబద్ధాలు చెప్పడం కూడా నేరమే. సామాన్య ప్రజలకోసం పనిచేసేది మన ప్రభుత్వమే' అని స్పష్టం చేశారు.

English summary
Amid polling in the first phase of Prime Minister Narendra Modi, who is campaigning in Lunavada, alleged that a Youth Congress leader raised objectionable questions about his parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X