వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''ఆ విద్యార్థిని మనసును ఎవరు కలుషితం చేస్తున్నారు''? ''నాది ఢిల్లీ యూనివర్శిటీయే''

కార్గిల్ యుద్దంలో మరణించిన కెప్టెన్ మణిదీప్ సింగ్ కుమార్తై గుర్మీర్ కౌర్ సోషల్ మీడియాలో ఎబివిపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి కిరణ్ రిజూజు స్పందించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కార్గిల్ యుద్దంలో మరణించిన కెప్టెన్ మణిదీప్ సింగ్ కుమార్తె గుర్మీర్ కౌర్ సోషల్ మీడియాలో ఎబివిపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.అయితే ఈ ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. ఆ బాలిక మనసును ఎవరు కలుషితం చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.

పాకిస్తాన్ తన తండ్రిని చంపలేదు, కార్గిల్ యుద్దమే తన తండ్రిని చంపాడని ఆమె ప్లకార్డును ప్రదర్శించిన ఫోటోను పోస్టు చేస్తూ ఎబివిపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రారంభించింది.

ఢిల్లీలోని రాంజాస్ కాలేజీలో ఎబివిపి కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ తాను డిల్లీయూనిర్శిటీ విధ్యార్థిననని, తాను ఎబివిపి భయపడడనని ఆమె సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలను పోస్ట్ చేసింది.

ఎబివిపిని విమర్శించినందుకుగాను తనపై అత్యాచారం చేస్తారని బెదిరించారని కూడ ఆమె ఆరోపణలు చేసింది.ఈ విషయాలన్నింటిని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది.

దీంతో ఈ విషయమై కేంద్ర హోంశాఖ సహయ శాఖ మంత్రి కిరణ్ రిజూజు స్పందించారు. ఆ అమ్మాయి మనసును ఎవరో కలుషితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఈ మేరకు మంత్రి కూడ సోషల్ మీడియా వేదికగానే ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా మంత్రి తన అభిప్రాయాలను పంచుకొన్నారు.

English summary
Minister of state for home Kiren Rijiju on Monday jumped into a fresh row when he hinted that a Delhi University student who has launched a social media campaign against the ABVP was being influenced by political rivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X