మాట తెచ్చిన చేటు: వారి వ్యాఖ్యలే మంత్రి పదవులకు చెక్ పెట్టాయా..?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో మోడీతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 58 మంత్రులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ క్యాబినెట్లో అమిత్ షా , జైశంకర్లు ప్రమాణస్వీకారం చేసి వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉంటే మోడీ తొలి క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసి తమ వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ సారి మంత్రి పదవి దక్కించుకోవడంలో విఫలమయ్యారు.
మేనకాగాంధీ నుంచి అనంత్ కుమార్ హెగ్డే వరకు చాలామంది మోడీ తొలి క్యాబినెట్లో పనిచేసిన వారికి ఈ సారి మంత్రి పదవులు దక్కలేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన మేనకా గాంధీ ఈసారి పదవి దక్కలేదు. ముస్లింలు తనకు ఓటు వేయకుంటే తమ పనులు జరగవని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. దీంతో ఆమె మంత్రి పదవికి దూరమయ్యారని తెలుస్తోంది. తనకు ఓటు వేయకుండా తమ పనులు చక్కబెట్టుకునేందుకు ముస్లింలు వస్తే తానేమీ చేయలేనని ఆమె ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారు. దీంతో ఆమెపై ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిషేధం విధించింది. అయితే మేనకా గాంధీ ఈసారి సుల్తాన్పూర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు.
అనంతకుమార్, మేనకా గాంధీల వ్యాఖ్యలతో బీజేపీ తీవ్ర ఇరకాటంలోకి పడిపోయింది. దీంతో బీజేపీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని వివాదాలకు కేరాఫ్గా నిలిచిన వారికి మోడీ రెండో కేబినెట్లో చోటు దక్కలేదు.