ఆ సమాచారం ఇవ్వలేం, భద్రత పరంగా ఇబ్బందులు: ఆర్బిఐ
కొత్త రూ.500, రూ,2వేల నోట్లపై క్లీన్ ఇండియా మిషన్ ప్రాజెక్టు లోగో ముద్రిస్తారా విషయాలను వెల్లడించేందకు నిరాకరించిన ఆర్బిఐ. ఆర్టిఐ కార్యకర్త ఈ మేరకు ఆర్బిఐకి ధరఖాస్దు చేశారు. ఈ ధరఖాస్తుపై సమాచారాన
ముంబై: కొత్త రూ. 500, రూ, 2వేల నోట్లపై ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'క్లీన్ ఇండియా మిషన్' ప్రాజెక్టు లోగో ముద్రిస్తారా? లేదా? అన్న వివరాలను వెల్లడించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు నిరాకరించింది.
సమాచార హక్కు చట్టం కింద ఈ విషయమై ఆర్బిఐను సమాచారం ఇవ్వాలని ఓ ఆర్టిఐ కార్యకర్త ఆర్జీ పెట్టాడు. అయితే ఈ ఆర్జీపై ఆర్బిఐ ఈ రకంగా స్పందించింది.
నోట్లపై కేంద్ర ప్రభుత్వ పథకాల ముద్రణ వివరాలతో కూడిన నకలు మార్గదర్శకాలను ఇవ్వలేమని తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇవి ప్రజలతో పంచుకోలేని వెల్లడించింది.
కొత్త నోట్లు ఎలా ఉంటాయి? మెటీరియల్, డిజైన్ ఇవన్నీ నోట్లకు సంబంధించిన భద్రతాపరమైన ఫీచర్లు. వీటిని ప్రజలకు తెలుపలేమని కూడ ప్రకటించింది.. సెక్షన్ 8 (1)(ఎ) కింద వీటిని మినహాయింపు ఉందని అని ఆర్బీఐ ప్రకటించింది. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే అంశమని పేర్కొంది.