కేరళ 10తరగతి విద్యార్థిని ఎందుకు గుర్రంపై పరీక్షకు వెళ్లింది ?
కేరళ 10th క్లాస్ విద్యార్థిని పరీక్షలు రాసేందుకు గుర్రపు స్వారీ చేస్తూ వెళ్లిన వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ,అయితే ఆమే గుర్రపు స్వారీ చేస్తు ఎందుకు పరీక్షలకు వెళ్లింది. అభివృద్ది చెందిన కేరళలో సరైన ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం లేకపోవడమా ,లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా , దీంతో అంతచిన్న వయస్సులో గుర్రంపై వెళ్లాల్సిన అవసరం ఏముంటుందనే అలోచన చాలమంది మదిలో మెదిలింది. ఈనేపథ్యంలోనే అసలు విషయాన్ని వెల్లడించింది విద్యార్థిని.
గుర్రం పై ఎందుకు వెళ్లావు ?
బాలిక ఎందుకు గుర్రంపై ఎందుకు వెళ్లింది, ఎప్పుడు ఇలానే వెళుతుందా అనే ప్రశ్నలకు ఆమే నేరుగా సమాధరం చెప్పింది, 7th క్లాస్ చదువుతున్న సమయం నుండి గుర్రపు స్వారీ చేస్తున్నానని ,అయితే బోర్ కోట్టినప్పుడు గాని, లేదా ప్రత్యేక సంధర్బాల్లో కాని గుర్రంపై వెళ్తానని చెప్పింది, ఈసంధర్భంలోనే 10 తరగతి ఎగ్జామ్ చివరి రోజు కావడంతో తాను గుర్రం పై వెళ్లినట్టు తెలిపింది,
సాధరణ మహిళలు గుర్రపు స్వారీ ఎందుకు చేయలేరు ?
విద్యార్థిని మొదటి సారి గుర్రపు స్వారి చేస్తున్నప్పుడు, తన మిత్రులలో ఒకరు ''మహిళలు గుర్రపు స్వారీ చేయడం చాల కష్టం, గుర్రపు స్వారీ చేయడం అనేది ఝాన్సీ రాణీ లాంటీ మహిళలకు మాత్రమే సాధ్యం " అనే స్నేహితుల మాటలే విద్యార్థిని గుర్రపు చేయడానకి ప్రధాన కారణం అయ్యాయని చెప్పింది. దీంతోనే "ఒక సాధరణ మహిళ ఎందుకు గుర్రపు స్వారీ చేయలేదనే ఆలోచననే" ఎడవ తరగతి నుండి తాను గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి నాంది పలికిందని తెలిపింది. కాగా దాన్నే హబిగా మార్చుకుంది, ప్రత్యేక సంధర్బాల్లో గుర్రపు స్వారీ చేయడం అలవాటు చేసుకుంది. అందుకే 10 తరగతి లో చివరి ఎగ్జామ్ కావడంతో ఆమే గుర్రం పై పరీక్ష రాసేందుకు వెళ్లానని చెప్పింది. అది కూడా ఓ ప్రోఫెషనల్ హర్స్ రైడర్ గా వెళ్లడం సోషల్ మీడియా వైరల్ అయింది.
పబ్లిక్ పరీక్షలకు తల్లిదండ్రులు
సాధరణంగా మొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్స్ కు హజరవుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు మరి దగ్గరుండి పరీక్ష కేంద్రానికి తీసుకువెళతారు. అది కుదరకపోతే తమ కుటంభంలోని ఎవరో ఒకరు వెంటవెళతారు. దీనికి విరుద్దంగా బాలిక హర్స్ రైడింగ్ చేస్తూ పరీక్షలకు వెళ్లింది. అదికూడ కెరళలాంటీ రాష్ట్రంలో ఏంజరిగింది.దీంతో ఏం జరిగిందనే మీమాంస చాలమందిలో చెలరేగింది.
వీడియో చూసిన అనంద్ మహింద్ర ఆశ్చర్యం
స్వంతగా గుర్రంపై రైడ్ చేస్తూ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఆ వీడియో వైరల్ కావడంతో .దీనిపై చాల మంది నెటిజన్లు బాలికను ప్రంశసిస్తూ ట్వీట్ కూడ చేశారు. ఈనేపథ్యంలోనే మహింద్ర అండ్ మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర సైతం విద్యార్థిని రైడ్ చూసి ఆశ్చర్యపోయారు. దీంతో విద్యార్థిని అడ్రస్ తోపాటు ,గుర్రంపై వెళ్తున్న ఫోటోను తన మొబైల్ లో స్ర్ర్కీన్ సేవర్ గా కూడ పెట్టుకుంటానని అన్నారు, దీంతోపాటు ప్రపంచవ్వాప్తంగా ఈ వీడియో వైరల్ కావలని ఆయన కోరుకున్నారు.