అసోం, త్రిపుర రాష్ట్రాలతో మిజోరాంకు గొడవలు ఎందుకు వచ్చాయి?
రెండు పొరుగు రాష్ట్రాలతో తమకు నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈశాన్య రాష్ట్రం మిజోరాం కోరింది. అయితే, పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉన్నట్లు చెబుతున్నారు.
అసోం, త్రిపుర రాష్ట్రాలతో మిజోరాంకు వివాదాలు ఏర్పడ్డాయి.
కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సోమవారం అసోం, మిజోరాం రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ రెండు వివాదాలూ రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించే ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు.
- 1962 యుద్ధంలో చైనా గెలిచినా.. అరుణాచల్ ప్రదేశ్ను ఎందుకు వదులుకుంది?
- భూటాన్: ఈ చిన్న దేశం భారత్కు ఎందుకంత ముఖ్యం?
https://twitter.com/ZoramthangaCM/status/1317875520432988160
అసోంతో వివాదం
తమ మధ్య జరుగుతున్న చర్చల విషయంలో సంతృప్తితో ఉన్నామని, సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామని అసోం, మిజోరాం ప్రభుత్వాలు చెబుతున్నాయి.
ఈ రెండు రాష్ట్రాల మధ్య ఓ చిన్న విషయం వివాదంగా మారింది. శనివారం రాత్రి కొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అసోంలోని లైలాపుర్లో మిజోరాం అధికారులు కోవిడ్-19 తనిఖీ శిబిరం ఏర్పాటు చేశారని... ఆ రాష్ట్రంలోకి వెళ్లే ట్రక్కు డ్రైవర్లకు, ఇతరులకు ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారని దక్షిణ అసోం పోలీస్ డీఐజీ దిలీప్ కుమార్ తెలిపారు.
తమ రాష్ట్రంలో మిజోరాం ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వహించడమేంటని అసోం ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ విషయమై అసోం ప్రబుత్వ అధికారులు అభ్యంతరం చెప్పారని, ఇంతలో అక్కడికి కొందరు మిజోరాం యువకులు వచ్చి ట్రక్కులు, ఇళ్లు, దుకాణాలు ధ్వంసం చేశారని లైలాపుర్ జిల్లా కలెక్టర్ చెప్పారు.
ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయని వివరించారు.
ప్రధాన రహదారి మార్గంలో అసోం పోలీసులు మూడు చోట్ల చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారని, అత్యవసర వస్తువులతో వస్తున్న వాహనాలను అడ్డుకున్నారని మిజోరాం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
థింఘులున్, సాయీహాయీపూయీ, వాయరెంగటే ప్రాంతాల్లో అసోం ప్రభుత్వం ఇలా వాహనాల రాకపోకలను అడ్డుకుందని మిజోరాం ప్రభుత్వం పేర్కొంది.
ఈ అంశమై మిజోరం మంత్రి మండలి అత్యవసర సమావేశం కూడా నిర్వహించింది. అనంతరం మిజోరాం ముఖ్యమంత్రి జోరామ్థాంగ్ అసోం సీఎం సర్బానంద సోనోవాల్తో ఫోన్లో మాట్లాడారు.
ఇద్దరి మధ్య చర్చలు ఫలప్రదంగా జరిగాయని, సోనోవాల్ కూడా వివాద పరిష్కారానికి చొరవ చూపించారని జోరామ్థాంగ్ అన్నారు. సోనోవాల్ కూడా ఇదే తరహాలో ట్వీట్ చేశారు.
హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతంలో అసోం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పరిమల్ సుక్లా పర్యటించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి కుదుటపడిందని పాత్రికేయులతో ఆయన చెప్పారు.
- నాగాలాండ్, మిజోరంలలో కుక్క మాంసాన్ని ఇప్పుడే ఎందుకు నిషేధించారు?
- టిబెట్ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
త్రిపురతో వివాదం
ఇటు త్రిపురతో మిజోరాంకు గొడవ ఏర్పడటానికి కూడా కారణం సరిహద్దు వివాదమే.
మిజోరాంకు చెందిన కొందరు గిరిజన యువకులు మామిత్ జిల్లాలో గుడి నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ జిల్లా అధికార యంత్రాంగం దీనికి అనుమతి ఇవ్వలేదని త్రిపుర హోంశాఖ అదనపు కార్యదర్శి ఆనిందియా భట్టాచార్య్ అన్నారు.
ఈ విషయంలో ఉద్రిక్తతలు పెరగడటంతో ఆ ప్రాంతంలో మిజోరాం 144 సెక్షన్ విధించింది. అయితే, సరిహద్దు విషయంలో స్పష్టత లేకపోవడంతో త్రిపురలోని మామిత్ జిల్లాలో కూడా దీన్ని అమలు చేశారు.
దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. అయితే, సీనియర్ అధికారులు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు అక్కడ పరిస్థితులు శాంతించాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ చెబుతున్నాయి.
అసోంతో మిజోరాంకు దాదాపు 165 కి.మీ.ల పొడవైన సరిహద్దు ఉంది. అయితే, దీన్ని సరిగ్గా గుర్తించలేదు. దీంతో మాటిమాటికీ వివాదాలు తలెత్తుతున్నాయి.
సరిహద్దును గుర్తించే ప్రక్రియ 1995లో మొదలైందని, ఇంకా పూర్తి కాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అసోంలోని లైలాపుర్ జిల్లా కూడా ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఒకటి. ఈ జిల్లాలోని ఓ పెద్ద ప్రాంతం తమదని మిజోరాం అంటోంది. సరిహద్దులు సరిగ్గా గుర్తించకపోవడంతో స్థానికులకు ప్రభుత్వాల కల్పించే ప్రయోజనాలు కూడా సరిగ్గా అందడం లేదు.
ఇవి కూడా చదవండి:
- సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- 'సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- ఇండియాలో కరోనావైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- 'కలకత్తా’లో వేశ్యలకు బలవంతంగా జననేంద్రియ పరీక్షలు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక 'దేశం’ ఇదేనా?
- బతికుండగానే ఫ్రీజర్లో పెట్టారు.. అయినా బతికాడు.. కానీ..
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- 'నాన్లోకల్ లీడర్ల’ అడ్డాగా విశాఖ... నగరంలో 30 ఏళ్లుగా వారి హవా సాగుతుండటానికి కారణాలేంటి?
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- 'బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- 'మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)