వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: అద్దెకు ఉంటోన్న వితంతువును కొట్టి చంపిన ఇంటి ఓనర్..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అద్దె ఇంట్లో నివసిస్తోన్న వితంతువు ఒకరు హత్యకు గురయ్యారు. ఆమె నివసిస్తోన్న ఇంటి ఓనరే ఆమెను కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంటి ఓనర్, అతనికి సహకరించిన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. హతురాలి పేరు మంజు గోయల్. ఏడాది కిందట ఆమె భర్త మరణించాడు. దీనితో ఆమె ఆరు నెలలుగా న్యూఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓ చిన్న ఇంట్లో అద్దె ఒంటరిగా నివసిస్తున్నారు. ఆ ఇళ్లు సతీష్ పహ్వా అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిది. రెండురోజుల కిందట సతీష్ పహ్వా ఇంట్లో కొన్ని వస్తువులు, కొంత నగదు చోరీకి గురైంది.

ఈ దొంగతనం చేసింది మంజు గోయెల్ అని అనుమానించారు సతీష్ కుటుంబ సభ్యులు. శనివారం రాత్రి ఆమెపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో మరణించింది. ఆమె చనిపోయినప్పటికీ పట్టించుకోలేదు ఓనర్, అతని కుటుంబ సభ్యులు.

Widow Tenant, Beaten to Death by Landlord Over Allegation of Theft in Mehrauli of Delhi

ఇంట్లో చొరబడి ఆమె దాచుకున్న 60 వేల రూపాయలను లాక్కున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే మంజు గోయల్ సోదరుడు సంఘటనాస్థలానికి రాగా.. అతడిపైనా దౌర్జన్యం చేశారు. దీనిపై స్థానికులు మెహ్రౌలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సతీష్ పహ్వా, అతని కుమారుడిని హత్యానేరం కింద అరెస్టు చేశారు.

English summary
A landlord and his son were arrested on Saturday for allegedly thrashing and killing a 44-year-old widow tenant over the suspicion of theft in Mehrauli, Delhi Police said. The incident was reported on Saturday under the limits of Mehrauli police station. The deceased who has identified as Manju Goel was living in a rented house in Mehrauli area for the last six months. She was working as a domestic help to earn her daily needs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X